AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహాభారతంలో హస్తినాపురం.. ఇప్పటి ఢిల్లీ రెండూ ఒక్కటేనా.? చరిత్ర ఏం చెబుతుంది.?

మహాభారతంలోని హస్తినాపురం గురించి వినే ఉంటారు. ఇది కురు సమరాజ్య పాలనలో భారతదేశానికి రాజధాని. అయితే చాలామంది ఇప్పట్టి ఢిల్లీనే హస్తినాపురంగా భావిస్తారు. ఇందులో ఉన్న నిజం ఎంత.? మహాభారతంలో హస్తినాపురం.. ఇప్పటి ఢిల్లీ రెండూ ఒక్కటేనా.? చరిత్ర చెబుతున్న విషయం ఏంటి.? ఈరోజు మనం వివరంగా తెలుసుకుందామా మరి.

Prudvi Battula
|

Updated on: Nov 24, 2025 | 12:50 PM

Share
హస్తినాపురం కురు రాజ్యానికి పురాతన రాజధాని. మహాభారతం ఇది గంగా నది ఒడ్డున కాండవప్రస్థం అనే ఓ పెద్ద అడవి నుంచి కొద్ది దూరంలో ఉందని చెబుతుంది. దీని ప్రక్రారం.. ప్రస్తుత ఢిల్లీ ద్వాపరయుగంలో హస్తినాపురం ఒక్కటి కాదని చెప్పవచ్చు. ఈ హస్తినాపూర్ అనేది ఆధునిక ఢిల్లీకి ఈశాన్యంగా దాదాపు 96 కి.మీ (60 మైళ్ళు) దూరంలో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం.

హస్తినాపురం కురు రాజ్యానికి పురాతన రాజధాని. మహాభారతం ఇది గంగా నది ఒడ్డున కాండవప్రస్థం అనే ఓ పెద్ద అడవి నుంచి కొద్ది దూరంలో ఉందని చెబుతుంది. దీని ప్రక్రారం.. ప్రస్తుత ఢిల్లీ ద్వాపరయుగంలో హస్తినాపురం ఒక్కటి కాదని చెప్పవచ్చు. ఈ హస్తినాపూర్ అనేది ఆధునిక ఢిల్లీకి ఈశాన్యంగా దాదాపు 96 కి.మీ (60 మైళ్ళు) దూరంలో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం.

1 / 5
ఆధునిక పట్టణం హస్తినాపూర్ గంగా నది కుడి ఒడ్డున ఉంది. దీని ప్రకారం ఇదే అప్పటి కురు సమరాజ్య రాజధాని అని చెప్పవచ్చు. హస్తినాపూర్‌లోని తవ్వకాలలో పెయింటెడ్ గ్రే వేర్ సుమారు 1200-600 BCE నాటివని తేలింది. తరువాత నార్తర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ బయటపడ్డాయి. ఇవి ఇతిహాస సంఘటనలు సెట్ చేయబడిన ప్రారంభ చారిత్రక కాలం కాలక్రమానికి సరిపోతాయి. ఈ ప్రాంతంలో బయటపడ్డ 7వ శతాబ్దపు రాగి పలకలో "హస్తినాపుర" గురించి ప్రస్తావించబడింది. ఇది పేరు కొనసాగింపును బలోపేతం చేస్తుంది.

ఆధునిక పట్టణం హస్తినాపూర్ గంగా నది కుడి ఒడ్డున ఉంది. దీని ప్రకారం ఇదే అప్పటి కురు సమరాజ్య రాజధాని అని చెప్పవచ్చు. హస్తినాపూర్‌లోని తవ్వకాలలో పెయింటెడ్ గ్రే వేర్ సుమారు 1200-600 BCE నాటివని తేలింది. తరువాత నార్తర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ బయటపడ్డాయి. ఇవి ఇతిహాస సంఘటనలు సెట్ చేయబడిన ప్రారంభ చారిత్రక కాలం కాలక్రమానికి సరిపోతాయి. ఈ ప్రాంతంలో బయటపడ్డ 7వ శతాబ్దపు రాగి పలకలో "హస్తినాపుర" గురించి ప్రస్తావించబడింది. ఇది పేరు కొనసాగింపును బలోపేతం చేస్తుంది.

2 / 5
కౌరవులు కాండవప్రస్థంలో కొంత భూమిని పాండవులకు మంజూరు చేసిన ఘటన గురించి మీరు వినే ఉంటారు.  తర్వాత వారు  స్థాపించిన రాజధాని నగరం పురాతన ఇంద్రప్రస్థం ఉన్న ప్రదేశం. ప్రస్తుతం ఢిల్లీ ఉన్న ప్రదేశం దాదాపుగా ఒక్కటే అని నమ్ముతారు. న్యూఢిల్లీలోని పురానా ఖిలా (పాత కోట) ప్రాంతం ఇంద్రప్రస్థ ప్రదేశంతో ముడిపడి ఉందంటారు.

కౌరవులు కాండవప్రస్థంలో కొంత భూమిని పాండవులకు మంజూరు చేసిన ఘటన గురించి మీరు వినే ఉంటారు. తర్వాత వారు స్థాపించిన రాజధాని నగరం పురాతన ఇంద్రప్రస్థం ఉన్న ప్రదేశం. ప్రస్తుతం ఢిల్లీ ఉన్న ప్రదేశం దాదాపుగా ఒక్కటే అని నమ్ముతారు. న్యూఢిల్లీలోని పురానా ఖిలా (పాత కోట) ప్రాంతం ఇంద్రప్రస్థ ప్రదేశంతో ముడిపడి ఉందంటారు.

3 / 5
రెండు ప్రదేశాలలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) నిర్వహించిన పురావస్తు తవ్వకాల్లో పెయింటెడ్ గ్రే వేర్ వంటి కళాఖండాలు బయటపడ్డాయి, ఇవి మహాభారత సంఘటనల సాంప్రదాయ కాలపరిమితికి అనుగుణంగా ఉండే కాలాల (సుమారు 1200–600 BCE) నుండి పురాతన స్థావరాల ఆధారాలుగా చూపుతున్నాయి, అయినప్పటికీ అంశం ఇంకా పరిశోధనలోనే ఉంది.

రెండు ప్రదేశాలలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) నిర్వహించిన పురావస్తు తవ్వకాల్లో పెయింటెడ్ గ్రే వేర్ వంటి కళాఖండాలు బయటపడ్డాయి, ఇవి మహాభారత సంఘటనల సాంప్రదాయ కాలపరిమితికి అనుగుణంగా ఉండే కాలాల (సుమారు 1200–600 BCE) నుండి పురాతన స్థావరాల ఆధారాలుగా చూపుతున్నాయి, అయినప్పటికీ అంశం ఇంకా పరిశోధనలోనే ఉంది.

4 / 5
రెండు నగరాలు మహాభారత కథనంలో ముఖ్యమైన కేంద్రాలు అయినప్పటికీ, హస్తినాపూర్ మరియు ఢిల్లీ (ఇంద్రప్రస్థ) కురు రాజ్యంలోని విభిన్న ప్రదేశాలు. హస్తినాపురం కౌరవుల రాజధానిగా ఉండగా... ఇంద్రప్రస్థం (ఢిల్లీ) పాండవుల రాజధానిగా ఉంది. అంటే ద్వాపర యుగంలో ఇంద్రప్రస్థం నేటి ఢిల్లీ ఒక్కటి అన్నమాట. హస్తినాపురం యూపీలో మీరట్ జిల్లాలో ఉంది

రెండు నగరాలు మహాభారత కథనంలో ముఖ్యమైన కేంద్రాలు అయినప్పటికీ, హస్తినాపూర్ మరియు ఢిల్లీ (ఇంద్రప్రస్థ) కురు రాజ్యంలోని విభిన్న ప్రదేశాలు. హస్తినాపురం కౌరవుల రాజధానిగా ఉండగా... ఇంద్రప్రస్థం (ఢిల్లీ) పాండవుల రాజధానిగా ఉంది. అంటే ద్వాపర యుగంలో ఇంద్రప్రస్థం నేటి ఢిల్లీ ఒక్కటి అన్నమాట. హస్తినాపురం యూపీలో మీరట్ జిల్లాలో ఉంది

5 / 5
Follow Us