ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి రూ. 3,43 ,68, 091 నగదు రాబడిగా లభించినట్లు ఆలయ ఈవో లవన్న చెప్పారు
ఈ ఆదాయం గత 28 రోజులలో మల్లన్న స్వామి బ్రమరాంబ అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో లభించినట్లు పేర్కొన్నారు.
అంతేకాదు నగదుతో పాటుగా 172 గ్రాముల 400 మిల్లీ గ్రాముల బంగారం, 10 కేజీల 350 గ్రాముల వెండి లభించాయి. పైవాటితో పాటు ఈ హుండీ లెక్కింపులో పలు రకాల విదేశీ కరెన్సీ కూడా లెక్కించారు అందులో యుఎస్ఏ డాలర్లు 150, ఆస్ట్రేలియా డాలర్లు 4, మలేషియా రింగిట్స్ 70, కెనడా రింగిట్స్ 80, యూ కే పౌండ్స్ మొదలైన వివిధ విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.
హుండీ లెక్కింపును పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బంది.. ఈవో లవన్న పర్యవేక్షణలో జరిగింది. నగదు లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానంకు చెందిన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.