Pooja with Flowers: పనిలో విఘ్నాలు తొలగాలన్నా, సరస్వతి కటాక్షం కలగాలన్నా ఏ దేవుడిని, ఏ పువ్వులతో పూజించాలంటే

Updated on: Sep 03, 2021 | 1:37 PM

మన హిందూ ధర్మంలో పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఫలం, పత్రం పుష్పం తోయం.. అంటే.. ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, లేదా నీరైనా గాని సమర్పిస్తే, ఆ స్వచ్ఛమైన మనస్సుగల భక్తుడు ఇచ్చేదానిని సంతోషంగా ఆరగిస్తానని కృష్ణుడు 'గీత'లో చెప్పాడు. అయితే వీటిల్లో పుష్పాలకు అత్యంత ప్రాధ్యానత ఇచ్చారు. ఆ విధంగా ఒక్కో దేవుడికి ఇష్టమైన ఒక్కో పువ్వు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 4
స్థిరమైన వ్యక్తిత్వానికి సూచిక బంతి పువ్వు.. ఇది విఘ్నలకధిపతి వినాయకుడికి ఇష్టమైన పువ్వు. పండగలు, ఫంక్షన్లు ఏమి జరిగినా అలంకరణలో బంతిపువ్వు ఉండాలసిందే.. ఈ పువ్వుతో అలంకరణ శుభప్రదమని భావన. అంతేకాదు..  బంతిపువ్వు కారణంగా సానుకూలత పెరిగి ఆలోచనల్లో మార్పులు వస్తాయి.

స్థిరమైన వ్యక్తిత్వానికి సూచిక బంతి పువ్వు.. ఇది విఘ్నలకధిపతి వినాయకుడికి ఇష్టమైన పువ్వు. పండగలు, ఫంక్షన్లు ఏమి జరిగినా అలంకరణలో బంతిపువ్వు ఉండాలసిందే.. ఈ పువ్వుతో అలంకరణ శుభప్రదమని భావన. అంతేకాదు.. బంతిపువ్వు కారణంగా సానుకూలత పెరిగి ఆలోచనల్లో మార్పులు వస్తాయి.

2 / 4
దేవతల చెట్టు పారిజాతం.. ఈ వృక్షం క్షీరసాగర మథన సమయంలో సముద్రం నుంచి జన్మించింది. ఈ చెట్టుని శ్రీ మహావిష్ణువు స్వర్గానికి తీసుకొచ్చాడట. ఇక అందమైన రూపముతో పాటు పాటు సువాసన వెదజల్లే ఈ పారిజాతం అంటే శ్రీమహావిష్ణువుకు బహుప్రీతి అని పురాణాల కథనం. అందుకనే ఏకాదశి రోజున పారిజాతం పూలతో పూజిస్తే.. అనుగ్రహం కలుగుతుందనని అంటారు.

దేవతల చెట్టు పారిజాతం.. ఈ వృక్షం క్షీరసాగర మథన సమయంలో సముద్రం నుంచి జన్మించింది. ఈ చెట్టుని శ్రీ మహావిష్ణువు స్వర్గానికి తీసుకొచ్చాడట. ఇక అందమైన రూపముతో పాటు పాటు సువాసన వెదజల్లే ఈ పారిజాతం అంటే శ్రీమహావిష్ణువుకు బహుప్రీతి అని పురాణాల కథనం. అందుకనే ఏకాదశి రోజున పారిజాతం పూలతో పూజిస్తే.. అనుగ్రహం కలుగుతుందనని అంటారు.

3 / 4
కాళీమాతకు ఎర్రమందారమంటే అత్యంత ఇష్టమట. ఎందుకంటే కాళీమాత నాలుకకి గుర్తు ఎర్రమందారమని.. ఎరుపు రంగు భయం కలిగించే ఆమె రూపానికి గుర్తుగా చెబుతారు. అందుకనే అమ్మవారి అనుగ్రహం కోసం 108 ఎర్రమందారాల దండను అమ్మవారికి సమర్పిస్తారు.

కాళీమాతకు ఎర్రమందారమంటే అత్యంత ఇష్టమట. ఎందుకంటే కాళీమాత నాలుకకి గుర్తు ఎర్రమందారమని.. ఎరుపు రంగు భయం కలిగించే ఆమె రూపానికి గుర్తుగా చెబుతారు. అందుకనే అమ్మవారి అనుగ్రహం కోసం 108 ఎర్రమందారాల దండను అమ్మవారికి సమర్పిస్తారు.

4 / 4
చదువుల తల్లి సరస్వతికి గోజిపువ్వు అంటే ఇష్టమట. ఈ పువ్వు సృజనాత్మకతకు చిహ్నం. అంతేకాదు జ్ఞానానికి, తెలివికి గుర్తుగా గోగి పువ్వు  నిలుస్తుంది. కనుక సరస్వతి కటాక్షం కోసం పూజించేవారు ఈ పువ్వులతో పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయట

చదువుల తల్లి సరస్వతికి గోజిపువ్వు అంటే ఇష్టమట. ఈ పువ్వు సృజనాత్మకతకు చిహ్నం. అంతేకాదు జ్ఞానానికి, తెలివికి గుర్తుగా గోగి పువ్వు నిలుస్తుంది. కనుక సరస్వతి కటాక్షం కోసం పూజించేవారు ఈ పువ్వులతో పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయట

Loading...
Unable to load recommendations.
Follow Us