
గరుడ పంచమి సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ తిరుమలలో వైభవంగా వాహనసేవ జరిగింది. శ్రీ మలయప్పస్వామివారు తనకు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.

శ్రీవారి వాహనాల్లో, సేవకుల్లోనూ అగ్రగణ్యుడు గరుడుడు.

నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ”గరుడపంచమి” పూజ చేస్తారని ప్రాశస్త్యం.

మంచి సంతానంతో కూడినటువంటి మాతృత్వాన్నే ప్రతి స్త్రీ ఆశిస్తుంటుంది ... ఆశపడుతుంటుంది. తమ పిల్లలు పరాక్రమవంతులై విజయాలు సాధించాలని కోరుకునే స్త్రీలకు అవసరమైన ఉత్తమమైన వ్రతమే 'గరుడపంచమి వ్రతం'. అన్నదమ్ములున్న యువతులు మాత్రమే 'శ్రావణ శుక్ల పంచమి' తిథిలో ఈ వ్రతమును చేయవలసి వుంటుంది.

కోవిడ్ నిబంధనల నడుమ గరుడ వాహనసేవని ఘనంగా నిర్వహించారు. ఈ సేవలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. స్వామివారు గరుడ వాహనంపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.