
అక్షయతృతీయ వచ్చేస్తోంది. ఏప్రిల్ 19,2026 ఆదివారం రోజున అక్షయతృతీయను జరుపుకుంటారు. అన్ని రోజుల్లో కెళ్లా, వైశాఖ మాసంలో వచ్చే ఈ అక్షయతృతీయ చాలా శుభప్రదమైనది అంటారు. అందుకే ఈ రోజున చాలా శుభకార్యాలు నిర్వహించుకుంటారు. అంతే కాకుండా ఈరోజే చాలా శక్తివంతమైన గజకేసరి రాజయోగం కూడా ఏర్పడుతుంది. చంద్రుడు, బృహస్పతి కలయిక వలన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ అక్షయతృతీయ రోజునే గజకేసరి రాజయోగం ఏర్పడటం వలన నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

తుల రాశి : తుల రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అక్షయ తృతీయ రోజే గజకేసరి రాజయోగం ఏర్పడటం వలన వీరికి లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది. దీంతో అదృష్టం కలిసి వస్తుంది. చాలా త్వరితగతిన మీ పనులు పూర్తి చేసుకుంటారు. సంపద పెరగడంతో, ఈ రాశి వారు బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ రాశి వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

మేష రాశి : మేష రాశి వారు ధనవంతులు అవుతారు. వీరు బంగారం లేదా వెండి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఈ రాశి వారికి గజకేసరి రాజయోగం వలన అదృష్టం తలుపు తడుతుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. అన్ని విధాలుగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది.

మీన రాశి :మీన రాశి వారికి శని నెగటివ్ ప్రభావం కాస్త తగ్గుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఈ రాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఎవరు అయితే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో వారి కల నెరవేరుతుంది. గొప్ప స్థాయిలో ఉంటారు. అన్నివిధాలుగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి. ముఖ్యంగా ఎవరు అయితే చాలా రోజుల నుంచి స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, వారి కోరిక నెరవేరుతుంది. సమాజంలో ఈ రాశి వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థి్క సహాయం అందుతుంది. అన్నింటా ఈ రాశి వారికి శుభ ఫలితాలే కలుగుతాయి.