
అయితే ఏప్రిల్ 20న కేతువు గ్రహం మఖ నక్షత్రంలోకి సంచారం చేయనుంది. ఈ సంచారం వలన ఏప్రిల్ నెలలో నాలుగు రాశుల వారికి శుభ సమయం ఆరంభం అయినట్లేనంట. ఈ సమయంలో వారు ఏ పని ప్రారంభించినా అందులో సక్సెస్ అవ్వడం ఖాయం అంటున్నారు పండితులు.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి చాలా అనుకూల సమయం. కెరీర్ పరంగా కలిసి వస్తుంది. ఆర్థిక వృద్ధి ఉంటుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కలిసి వస్తుంది. కళారంగంలో ఉన్నవారు ఎక్కువ లాభాలు అందుకుంటారు. కొత్త ఆదాయ వనరులు పుట్టుకొస్తాయి. గతంలో కంటే ఇప్పుడే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పని చేస్తారు. అన్ని విధాలుగా అద్భుతంగా ఉండనుంది.

సింహ రాశి : సింహ రాశి వారికి కేతు గ్రహ సంచారం పురోగతిని తీసుకొస్తుంది. వీరు పెట్టుబడుల నుంచి అత్యధిక లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పాత పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు అందుకుంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

మకర రాశి : మకర రాశి వారికి కేతు గ్రహ సంచారం అద్భుతమైన ప్రయోజనాలను అందించనుంది. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే ఈ రాశి వారు పాత అప్పులను తీర్చుకొని చాలా ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి కేతు గ్రహ సంచారం వలన జీవితంలో కొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఇది మంచి సమయం. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. మానసికంగా కూడా కలిసి ఉంటుంది.