
దీపావళి అంటే ముందుగా గుర్తుకొచ్చేది ప్రమిదలు.. అయితే కాలక్రమంలో వీటిల్లో అనేక మార్పులు వచ్చాయి. ఇప్పుడు మట్టి ప్రమిదలు ప్లేస్ లో అనేక ఆకృతుల్లో ప్రమిదలు మార్కెట్ లో లభిస్తున్నాయి. బడ్జెట్ కు అనుగుణంగా మనం వాటిని ఎంపిక చేసుకోవచ్చు.

పండగ శోభను ఇంటి ముందుకు తీసుకొచ్చేది రంగవల్లులు. దీపావళి రోజున ఇంటిముందు ముగ్గును వేసి.. అందులో ప్రమిదలను పెట్టడానికి మగువలు ఇష్టపడతారు.

దీపావళి అలంకరణల్లో తోరణాలు కూడా ప్రముఖ స్థానం ఉంది. మామిడాకులతో పాటు. ఇప్పుడు రెడీ మెడ్ గా లభించే ఎన్నో అలంకరణ వస్తువులతో దీపావళికి గుమ్మలను అలంకరిస్తున్నారు.

దీపావళికి ఇంటిని లక్ష్మీదేవి, గణపతిని పూజిస్తారు. లక్ష్మి, గణపతి విగ్రహాలను అందంగా పువ్వులతో అలంకరించి వాటి ముందు ప్రమిదలతో దీపం పెడితే.. ఇల్లు లక్ష్మి కళతో నిండుగా అందంగా కనిపిస్తుంది.

పండగ పర్వదినాన మరింత శోభాయమానంగా కనిపించాలంటే.. రంగురంగుల పూలు, దీపాలు, రంగుల బల్బులు, ప్రముఖ పాత్రని పోషిస్తాయి.

ఇక దీపావళి రోజున దేవుడిగదిలోనే కాదు.. ఇంటి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇక ఇంటి పైకప్పునుంచి ఎలక్ట్రిక్ లైట్లు తోరణాలు వెళ్లదీస్తే మరింత అందంగా కనిపిస్తుంది. సాంప్రదాయ ప్రమిదలతో పాటు.. మధ్యలో విభిన్నంగా వుండేలా మంచి వాసననిచ్చే రంగు రంగుల కేండిల్స్ పెట్టండి.