
2026 సంవత్సరపు చైత్ర నవరాత్రి ఉత్సవాలు ఈరోజు, మార్చి 19న ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పవిత్ర నవరాత్రి శుక్ల యోగం, బ్రహ్మ యోగం, సర్వార్థ సిద్ధి యోగం అనే మూడు శుభ యోగాల సమన్వయంతో ఆరంభమవ్వడం ప్రత్యేకత. అందువల్ల, ఈ నవరాత్రి కొన్ని రాశుల వారికి విశేషంగా శుభప్రదంగా మారనుంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి సువర్ణావకాశాలు కలుగుతూ, దుర్గాదేవి అనుగ్రహం ప్రత్యేకంగా లభించే అవకాశం ఉంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి: ఈ నవరాత్రులు వృషభ రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు వృత్తి రంగంలో మంచి పురోగతి కనిపిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. పెద్ద ఆశయాలు నెరవేరే అవకాశం ఉండగా, ముఖ్యమైన ఒప్పందాలు కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. మానసిక ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ తొమ్మిది రోజుల్లో యువతులకు పటిక బెల్లం పంచడం శుభప్రదం.

మిథున రాశి: మిథున రాశి వారికి ఈ నవరాత్రులు విజయానికి మార్గం చూపిస్తాయి. కొత్త వ్యాపార అవకాశాలు, ఒప్పందాలు లభించవచ్చు. ఉద్యోగంలో మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారుల మద్దతుతో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆదాయం పెరిగే మార్గాలు కనిపిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో దుర్గా చాలీసాను తొమ్మిది రోజుల పాటు పఠించడం శ్రేయస్కరం.

వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి ఈ నవరాత్రులు అన్ని రంగాలలో విజయాన్ని అందించవచ్చు. విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి, సృజనాత్మకత మెరుగుపడుతుంది. కుటుంబానికి సామాజిక గౌరవం పెరుగుతుంది. మీ సలహాలను ఇతరులు గౌరవంగా స్వీకరిస్తారు. శారీరక శక్తి, ఉత్సాహం పెరుగుతుంది. దుర్గాదేవికి ఎర్రటి పుష్పాలను సమర్పించడం మంగళకరం.

కన్యా రాశి: కన్యా రాశి వారికి ఈ నవరాత్రులు శుభఫలితాలను అందిస్తాయి. వ్యాపారంలో వృద్ధి సాధ్యమై, మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. వివాహ యోగాలు కలగవచ్చు. ఇతరులకు సహాయం చేయాలనే మనసు పెరుగుతుంది. “ఓం దుం దుర్గాయ నమః” మంత్రాన్ని జపించడం ఎంతో శుభప్రదం. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)