
చాలా మంది యాలకులు అంటే చాలు వీటిని ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తారు. వీటి వలన ఎలాంటి ప్రయోజనాలు ఉండవు అనుకుంటారు. కానీ వీటికి ఆధ్యాత్మిక శక్తి కూడా ఎక్కువగానే ఉంటుందంట. వీటిని పవిత్రతకు, శభానికి ప్రతీకగా భావిస్తారు. అందువలన వీటిని ప్రత్యేకంగా పూజించడం వలన ఆర్థిక, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారంట.

యాలకులకు లక్ష్మీదేవికి చాలా సంబంధం ఉంటుంది. యాలకుల మాల ధరించడం చాలా మంచిదని చెబుతుంటారు పండితులు. ముఖ్యంగా ఈ మాలను దేవుడికి సమర్పించడం వలన కూడా శుభ ఫలితాలు కూడా అందుకుంటారంట. ఆర్థిక, అనారోగ్య సమస్యలతో బాధపడే వారు ఈ మాలను ధరించడం లేదా దేవుడికి సమర్పించడం వలన కోరిక కోర్కెలు నెరవేరుతాయంట.

ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడే వారు, అప్పులు తీరని వారు శుక్రవారం లక్ష్మీదేవికి లేదా బుధవారం హకగ్రీవునికి యాలకుల మాల సమర్పించడం వలన ఇంటిలో సంపద పెరిగి అప్పుల బాధలు అన్నీ తొలిగిపోతాయంట. అంతే కాకుండా కెరీర్ పరంగా కూడా అద్భుతంగా రాణిస్తారంట.

అయితే అసలు ఈ యాలకులను ఎలా పూజించాలి? ఎలా మాల ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయో ఇప్పుడు చూద్దాం. శుక్ర వారం రోజున ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో ఐదు యాలకులు పెట్టి, ఒక చిన్న మూటలా కట్టాలి. దానిని మీరు రాత్రి నిద్రపోయే సమయంలో దిండు కింద పెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ యాలకులను ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి. దీని వలన చెడు దృష్టి పోయి, ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి. అయితే ఇలా మూడు శుక్ర వారాలు చేయాలి.

అంతే కాకుండా యాలకులను మాలలా చుట్టి దానిని ఐదు శుక్రవారాలు ధరించడం వలన కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయంట. అలాగే వెంకటేశ్వర స్వామికి యాలకులు చాలా ఇష్టం అని చెబుతారు. అందువలన స్వామి వారికి ఏడు యాలకుల దండలు వేయడం వలన కూడా అప్పుల బాధలు తీరిపోతాయంట. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు