
2026 సంవత్సరంలో ఖగోళ సంఘటన అయిన సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఈ సంవత్సరంలో ఇదే చివరి సూర్యగ్రహణం. అయితే ఇది ఆగస్టు 12న సంభవించనుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలియజేయడం జరిగింది. ఇక సంపూర్ణ సూర్య గ్రహణం అంటే చంద్రుడు, సూర్యుడికి, భూమికి మధ్య నేరుగా వెళ్లిన సమయంలో సూర్యకాంతి మొత్తాన్ని చంద్రుడు అడ్డుకోవడం వలన భూమిపై సూర్యుడి వెలుగు కనిపించకుండా కేవలం నీడ ఏర్పడుతుంది. దీనిని సంపూర్ణ సూర్య గ్రహణం అంటారు.

అయితే ఆగస్టు12న ఈ సంపూర్ణసూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఇది భారత్లో కనిపించదు, అట్లాంటిక్, యూరప్ వంటి కొన్ని ప్రాంతాలలో సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ముఖ్యంగా దీనిని తూర్పు, ఈశాన్య మూలలలోని ప్రజలు ఈ గ్రహణాన్ని సులభంగా చూడగలుగుతారంట.

ఈ సారి ఏర్పడే సూర్య గ్రహణం చాలా ప్రత్యేకమైనది అని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే? సంపూర్ణ సూర్య గ్రహణం అంటే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి రావడం జరుగుతుంది. ఈ సమయంలో సూర్యుడు కనిపించడు. దీనిని గ్రహణం అంటారు. ఈ సంవత్సరం ఆరు నిమిషాల పాటు గ్రహణం ఏర్పడుతుందంట. ముఖ్యంగా 23 సెకండ్ల పాటు మొత్తం చీకటిగా ఉండనున్నదంట. పట్టపగలే చీకటి ఉన్న అనుభూతి కలుగుతుందంట. ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈలలో పట్టపగలే కొన్ని నిమిషాల పాటు చీకటి అలుముకుంటుందంట.

ఇక ఈ సంపూర్ణ సూర్య గ్రహణం భారత్లో కనిపించదు కాబట్టి, ఇక్కడి వారు సూతక కాలం నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారు పండితులు. అంతే కాకుండా దీని ప్రభావం భారత్పై ఏ మాత్రం ఉండదంట.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు