
శ్రావణ మాసం ప్రారంభం అయ్యింది. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ ఉపవాసాలు ఉంటూ, వ్రతాలు చేసుకుంటూ, అమ్మవారిని పూజిస్తారు. ఇక శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయాలు భక్తుల రాకతో కలకలలాడి పోయాయి. అంతే కాకుండా శ్రావణ మాసం రెండో శుక్రవారం అమ్మవారు ధనలక్ష్మిగా దర్శనం ఇచ్చారు.

శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా అనకాపల్లిలో నూకాలమ్మ.. ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. 10 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారిని అందంగా అలంకరించారు.

వేరు వేరు కరెన్సీ నోట్లతో అమ్మవారి గర్భగుడిని ప్రత్యేక అలంకరణతో అందంగా తీర్చిదిద్దారు. ఆలయములోని ప్రధాన ప్రాంగణం కరెన్సీ నోట్లతో కలకలలాడింది.

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళలు పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సామూహిక వరలక్ష్మీ వ్రతాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు జరిపించారు.

ధనలక్ష్మిగా దర్శనమిస్తున్న అమ్మవారిని చూసి నందుకు భక్తులు బారులు తీరారు. కేవలం అనకాపల్లి నుంచి గాక పరిసర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకొని, మొక్కలు తీర్చుకున్నారు. భక్తుల రాకతో ఆలయం సందడిగా మారింది.