
రోదసీపై ఆధిపత్యానికి డ్రాగన్ కొత్త ఎత్తులు వేస్తోంది. త్వరలో స్పేస్ లోకి కోతులను పంపి ప్రయోగాలు చేసుందుకు రెడీ అవుతోంది.

జీరో గ్రావిటీలో కోతుల పునరుత్పత్తి సాధ్యమా ?? అన్న విషయంపై పరిశోధనలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. చైనా రోదసీలో కొత్తగా నిర్మించిన తియాంగాంగ్ స్పేస్స్టేషన్లో ఈ పరిశోధనలు నిర్వహిస్తారు.

రోదసీ లోకి పంపించిన తరువాత కోతుల ప్రవర్తన ఎలా ఉంటుంది .. వాటిపెరుగుదల ఎలా ఉంటుందన్న విషయంపై రీసెర్చ్ చేస్తారు.

రోదసీలో కోతుల పునరుత్పత్తి సాధ్యమా ? అన్న విషయం పైనే ప్రధానంగా పరిశోధన జరుగుతుంది. రోదసీలో ఇప్పటికే పలు జీవులపై చైనా శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు.

భవిష్యత్లో మనుషులు కూడా అక్కడ కాపురం చేసే అవకాశం ఉందా ? అన్న విషయంపై కూడా పరిశోధనలు జరిగే అవకాశం ఉంది.

చైనా శాస్త్రవేత్తలు ఇప్పటికే ఎలుకలను రోదసీ లోకి పంపించి పరిశోధనలు చేశారు. ఎలుకల్లో అక్కడ పునరుత్పత్తి సాధ్యమా ? అన్న విషయంపై పరిశోధనలు జరిగాయి.

రష్యా , అమెరికా స్పేస్ స్టేషన్లకు ధీటుగా తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ను చైనా తీర్చిదిద్దింది.