
ఎన్నడూ లేని విధంగా ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఇక ఇదే సమయంలో చాలా మంది దాహం తీరడం కోసం డ్రింక్స్ వైపు చూస్తున్నారు. మండే ఎండల్లో అలసట, శరీర వేడి తగ్గాలంటే ఈ అమ్మమ్మల కాలం నాటి పల్లెటూరి సమ్మర్ ఎనర్జీ బెస్ట్ డ్రింక్ తాగాలి. ఇది శరీరానికి చల్లదనం ఇచ్చి జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

పల్లెటూరి సమ్మర్ డ్రింక్ కు కావలసిన పదార్థాలు: ఒక కప్పు పుదీనా ఆకులు, రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, మూడు టేబుల్ స్పూన్స్ చక్కెర లేదా తేనెను తీసుకోవాలి. ఇంకా అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, మూడు గ్లాస్ లు కూలింగ్ వాటర్, ఒక కప్పు ఐస్ క్యూబ్స్ ను తీసుకోవాలి.

పల్లెటూరి సమ్మర్ డ్రింక్ తయారీ విధానం: ముందుగా ఒక కప్పు పుదీనా ఆకులను తీసుకుని వాటిని బాగా పెట్టుకోవాలి. ఇంకా దీనిని మిక్సీ జార్లోకడిగిన పుదీనా ఆకులు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, చక్కెర కానీ, తేనెను కానీ దీనిలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కూలింగ్ వాటర్ పోసి ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి.

ఇంకా ఆ తరువాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలపాలి. కొద్దీ సేపటి తరవాత జ్యూస్ను వడపోసి గ్లాసుల్లో పోయాలి. చివర్లో ఐస్ క్యూబ్స్ కూడా వేసి చల్లగా తాగొచ్చు. పాత రోజుల్లో వేసవిలో ఇంటింటా తయారయ్యే పల్లెటూరి సమ్మర్ డ్రింక్ ఇదే అని కొందరు చెబుతున్నారు.

ఇది తాగిన తరవాత శరీరానికి కూల్ ఇవ్వడంతో పాటు శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)