
గుమ్మడి ముక్కలతో ఈ కూర గత కొద్దీ కాలం నుంచి మటన్ కూరతో పోటీ పడుతుంది. ఇంకా అంతకముందు దీనిని అందరూ సాధారణ కూరగాయగా చూసేవాళ్ళు. కానీ , ఇప్పుడు దీని టైం వచ్చేసింది. ఈ కూరను మసాలాలతో చేస్తే అదిరిపోతోంది. ఇంకా దీనిని వండే రీతిలో వండితే మేక మాంసం తిన్న రుచి వస్తుందని కొందరు అంటున్నారు.

ఇంకా కొందరు కొన్ని ఏరియాల్లో పేదల మటన్ కూర అని ముద్దుగా పిలుచుకుంటారు. దీనిలో ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు ఎండు మిర్చి, ఘాటు కారం, ధనియాల పొడి, దినుసుల గరం మసాలా, కొత్తిమీర వంటి వాటిని వేసి చిన్నగా కుక్ చేసి ఉడికిస్తే గుమ్మడి ముక్కలు మటన్ ముక్కల్లా మెత్తగా మారిపోతాయి.

ఈ మసాలాతో అన్నం తింటే ప్రతి ముద్ద నోట్లో వేసుకున్న కరిగిపోతోంది. రుచి ఇలా ఉండటం వలన వెజ్ అయినా కూడా నాన్వెజ్ టేస్ట్ వస్తుంది అలాగే అంతే ఇష్టంగా దీనిని తింటున్నారు. ఇంకా ఈ కూరను వేడి వేడి అన్నంలో తింటే ఇంకా టెస్ట్ గా ఉంటుంది. ఈ ముక్కలతో బిర్యానీ చేసుకుని తింటే ఏ మాంసం కూరలు కూడా సరిపోవు.

మీరు మీ ఇంట్లో ఒకసారి చేసుకుంటే మీ ఫేవరేట్ డిష్ గా అయిపోతోంది. ఇంకా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్లేట్స్ మీద ప్లేట్స్ లాగిస్తారు. ఇంకా ఇది ఫ్యామిలీ స్పెషల్ డిష్ లిస్ట్ లోకి చేరిపోతోంది . తక్కువ ఖర్చుతో మంచి కూర తినొచ్చు. వెజ్ తినే వాళ్ళకి ఇదే మటన్ లెక్క అన్నమాట.

ప్రస్తుత మార్కెట్లో నాన్ వెజ్ ధరలు కొండెక్కి కూర్చొంటున్నాయి ఇంత భారీగా పెరిగిపోతున్న సమయంలో నాన్ వెజ్ టేస్ట్ కావాలనుకునేవారికి ఈ గుమ్మడి ముక్కల కూర బెస్ట్. మటన్ కి ఏ మాత్రం తీసిపోని తేలికగా జీర్ణమవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇంకా దీనిలో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి