
ఈ తీగ జాతి మొక్క ఆకులు నమిలి తింటే పుల్లగా ఉంటాయి. అందుకే వీటికి పులి చింత అని పేరు. ఈ పులి చింత ఆకులను తినటం వలన ముక్కు, గొంతు, మలం ద్వారా పడే రక్తాన్ని నివారిస్తుంది. గొంతు సంబంధిత రోగాలను అరికడుతుంది. ఈ ఆకులను ముద్దగా నూరి రసాన్ని ఫైల్స్ ఉన్నచోట రాసుకుంటే అవి త్వరగా రాలిపోతాయి.

పులి చింత ఆకులను పప్పుగా వండుకొని తింటే కూడా చక్కటి ఫలితం ఉంటుంది. వాతం తగ్గిస్తుంది. ఈ ఆకులను, సొంటి, నెయ్యి, తేనె సమాన మోతాదు లో కలిపి తీసుకుంటే వాతం తగ్గుతుంది. ఈ ఆకులతో మూత్ర నాళాల రుగ్మతలకు చికిత్స చేస్తారు. శ్వాస సమస్యలను తొలగిస్తుంది.

ఆహారంలో పులి చింతను చేర్చుకోవటం వల్ల నిద్రలేమికి మేలు చేస్తుంది. కండరాల బలాన్ని మెరుగుపరుస్తుంది. పులిచింత ఆకు రసంతో కాస్తంత సైంధవ లవణం కలిపి పూస్తే పులిపిర్లు రాలిపోతాయి. పులిచింత వేళ్లను నీటిలో వేసి కాచి, ఆ కషాయంతో 10 నిమిషాల పాటు పుక్కిలిస్తే కదిలే దంతాలు గట్టిపడతాయి. పులిచింత మొక్క వేళ్లను నీడన ఎండించి పొడి చేసి పండ్ల పొడిగా వాడినా చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

సైందవ లవణం చేర్చిన పులిచింత ఆకు రసాన్ని తేలు కుట్టిన చోట రుద్దితే చాలా త్వరగా విషం దిగిపోతుంది. పులిచింత ఆకులతో చేసిన పచ్చడిని తింటూ వుంటే ఆకలి పెరగడంతో పాటు ఆస్తమా తీవ్రత తగ్గుతుంది.

40 నుంచి 60 మి.లీ పులి చింతల ఆకు రసంలో పొంగించిన ఇంగువ కలిపి సేవిస్తే కడుపు నొప్పి తగ్గుతుంది. పదిహేను ఆకుల రసంలో పటిక బెల్లం కలిపి తీసుకుంటే ఒంట్లో వేడి తగ్గిపోతుంది. ఈ ఆకులను కూరగా, పచ్చడిగా వండుకుని తింటే ఆస్తమా నుంచి ఉపశమనం కలుగుతుంది.