
పేదోళ్ల టిఫిన్ కు కావలసిన పదార్థాలు : ఒక కప్పు అన్నం , కొద్దిగా చింతపండు, ఒక టేబుల్ స్పూన్ కారం పొడి , రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, రెండు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , ఓక్ టేబుల్ స్పూన్ మినప్పప్పు , ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు , నాలుగు కరివేపాకు రెబ్బలు, నాలుగు ఎండు మిర్చిని తీసుకోవాలి.

పేదోళ్ల టిఫిన్ తయారీ విధానం: ముందుగా చింతపండును తీసుకుని 10 నిమిషాలు నానబెట్టి దాని నుంచి రసం తీసుకోవాలి. ఇంకా ఈ పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, మినప్పప్పు, ఇంకా కొంచం శనగపప్పు కూడా వేయించి రెడీ చేసుకోవాలి.

అయితే, ఇంకా నాలుగు కరివేపాకు ఆకులు, కొద్దిగా ఎండు మిర్చి, నాలుగు పచ్చిమిర్చి, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించాలి. ఇక ఇప్పుడు అలాగే వీటితో పాటు చింతపండు రసం, కొద్దిగా ఉప్పు, ఇంకా ఒక టేబుల్ స్పూన్ కారం పొడి కూడా వేసి 2 నిమిషాలు ఉడికించాలి. అలాగే ఈ మంటను తగ్గించి అన్నం కలపాలి.

అయితే మీరు వేసే అన్నానికి పులుపు, కారం అన్ని కరెక్ట్ గా పట్టేలా చూసుకోవాలి. ఇంకా మూడు నిముషాల పాటు స్టవ్ మీదే ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంకా వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది. కొద్దీ కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసి నూరితే రుచి బాగా పెరుగుతుంది. ఇంకా పల్లీలు లేదా నువ్వుల పొడిని కలిపితే మంచి టేస్ట్ వస్తుంది

ఇది ఉదయం టిఫిన్గా కింద లేక సాయంత్రం స్నాక్గా కూడా తీసుకుంటే సరిపోతుంది. ఉదయం పనులకు వెళ్ళే వాళ్ళు ఇది తినే వెళ్తారు. దీని కోసం ఎక్కువ డబ్బు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. చాలా తక్కువగానే మంచి రుచి వస్తుంది. మిగిలిన అన్నంతోనే చేసే బెస్ట్ రెసిపీ ఇదే అని చెప్పొచ్చు.