విశాఖలో జరిగే నేవీ డే వేడుకలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించిన అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తూర్పునావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ కలిశారు. ఈ సందర్భంగా నేవీ ఆఫీసర్ .. డిసెంబర్ 4న విశాఖలో జరిగే నేవీ డే వేడుకలకు విచ్చేయాలంటూ సీఎంను అహ్వాహించారు.