
సంక్రాంతి వేళ ఏపీ ప్రభుత్వం వరుస శుభవార్తలు అందిస్తోంది. సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగులు, వ్యాపారులకు ఉపయోగపడేలా అనేక నిర్ణయాలు ప్రకటిస్తోంది. కొత్త కార్యక్రమాలను ప్రాంభించడంతో పాటు ఉద్యోగులకు డీఏ, ఏరియర్స్ విడుదల, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు విడుదల వంటి నిర్ణయాలు తీసుకుని పండగ ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది.

ఏపీలో నీరు-చెట్టు పథకం కింద పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లకు పెండింగ్ నిధులు విడుదల చేసింది. ఇందుకోసం రూ.40 కోట్ల నిధులు విడుదల చేసింది. దీని ద్వారా 19వేల మంది కాంట్రాక్టర్లకు ఊరట కలిగినట్లయింది. ఇక ఉద్యోగులకు డీఏ, డీఆర్తో పాటు ఎరియర్స్ ప్రకటించింది. వీటన్నింటి కోసం రూ.2653 కోట్ల నిధులకు ఆర్ధికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఉద్యోగుల డీఏ కోసం ఏకంగా రూ.110 కోట్లు విడుదుల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక పోలీసులకు సరెండర్ లీవ్ చెల్లింపులు కూడా రిలీజ్ చేయనుంది. దీని ద్వారా 55 వేల మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ఇక డీఏ, ఏరియర్స్ చెల్లింపులతో 2.25 లక్షల మంది ఉద్యోగులు బెనిఫిట్ పొందనున్నారు.

అలాగే 2.70 లక్షల మంది పెన్షన్లర్లు కూడా ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో లబ్ది పొందనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల మొత్తం 5.70 లక్షల మంది లబ్ది పొందనున్నారు. వీటిని త్వరలో వారి అకౌంట్లలో రిలీజ్ చేయనుంది.

అటు సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో అన్న క్యాంటీన్ల ఓపెనింగ్కు ప్రభుత్వం సిద్దమైంది. మండల కేంద్రాల్లో కొత్తగా అన్న క్యాంటీన్లు ప్రారంభించనుంది. దీంతో గ్రామీణ ప్రజలకు కూడా రూ.5కే టిఫిన్, లంచ్, డిన్నర్ సౌకర్యం అందుబాటులోకి రానుంది.