
కావాల్సిన పదార్థాలు : జీలకర్ర, కారం, వెల్లుల్లి రెబ్బలు, ఆవ నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, టొమాటో ప్యూరీ, ఉప్పు, పాలకూర, వేడి నీళ్లు, కొత్తి మీర, మెత్తటి పనీర్. కరివేపాకు, పసుపు, గరం మసాలా.

తయారీ విధానం : ముందుగా స్టవ్ ఆన్ చేయండి. పాన్ పెట్టి అందులో కొంచెం నూనె పోసి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లులి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో పసుపు, మసాలా, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇవి కాస్త రంగు మారిన తర్వాత ఇందులో టొమాటో ప్యూరీ వేయాలి.

రెండు మూడు నిమిషాలపాటు, గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించి, ఇందులో ఉప్పు, పాల కూర ఆకులు వేసి అది చిక్కటి మిశ్రమంలా వచ్చే వరకు ఉడకనివ్వాలి.

Pదీని తర్వాత చాలా మంది పనీర్ ముక్కలను మిశ్రమంలో వేస్తారు. కానీ మీరు ఇప్పుడు పనీర్ కాకుండా, పనీర్ పేస్ట్ వేయాలి. దీనిని సన్నని మంటపై మరో ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి.

ఈ మిశ్రమం బాగా ఉడికిన తర్వాత దీనిని తాళింపు కోసం రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి , అందులో ఆవ నూనె వేసి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసి, వేయించాలి. ఇవి బంగారు రంగు వచ్చిన తర్వాత కారం వేయాలి. తర్వాత ఇందులో పనీర్ క్రీమీ మిశ్రమం వేయాలి. చివరగా కొత్తిమీర చల్లుకుంటే అంతే, టేస్టీ టేస్టీ పాలక్ పనీర్ రెడీ.