
ముందుగా పచ్చి చింతపండును తీసుకుని దానిని నీటితో శుభ్రపరచి ఒక చిన్న నిమ్మకాయంత చింతను తీసుకుని 20 నిముషాలు నానాబెట్టుకోవాలి. ఆ తర్వాత ఐదు సార్లు నీటిని కలుపుతూ ఆ రసాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి.

మసాలా రెడీ చేసుకోవాలి : ఇప్పుడు గ్రైండ్ లేదా రోట్లో 6 వెల్లుల్లి రెబ్బలు, 4 పెద్ద ఉల్లిపాయలు, రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ మిరియాలు, 7 పచ్చిమిర్చి, అర కట్ట కొత్తిమీర, కరివేపాకు ఆకులు కూడా వేసి కొద్దిగా పేస్ట్ మాదిరి దంచుకోవాలి.

ఇక ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు రసంలో ఈ నూరిన పేస్ట్ మిశ్రమాన్ని వేసి, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, కొద్దిగా తురిమిన బెల్లాన్ని వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి.

తాలింపు పెట్టకుండానే కలపొచ్చు: స్టవ్ వెలిగించి పాన్ వేసి దానిలో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, పచ్చి ఆవాలు, జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు, అర టీ స్పూన్ పసుపు, ఈ రసం మిశ్రమంలో మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి.

Raw Tamarind Rasam 5