AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: అన్నంలో ఇది కలిపి తింటే షుగర్ లెవల్స్ పెరగవు.. ఏ డాక్టర్ చెప్పని చిట్కా..

నేటి కాలంలో మధుమేహం (డయాబెటిస్), బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు సర్వసాధారణం అయ్యాయి. అయితే, కేవలం మన నిత్య జీవితంలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ వ్యాధులను సహజంగా ఎలా నియంత్రించవచ్చో ప్రముఖ వైద్యులు డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ ఒక ఇంటర్వ్యూలో క్షుణ్ణంగా వివరించారు.

Phani CH
|

Updated on: May 26, 2026 | 4:58 PM

Share
ప్రస్తుత రోజుల్లో భారతదేశం ప్రపంచంలోనే మధుమేహానికి (Diabetes Capital) కేంద్రంగా మారుతోంది. వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయసులోనే చాలా మంది బీపీ, షుగర్, పక్షవాతం, గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు.  డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ వ్యాధులన్నింటికీ మన ఆధునిక జీవన విధానం మరియు తప్పుడు ఆహార అలవాట్లే ప్రధాన కారణమని స్పష్టం చేశారు.

ప్రస్తుత రోజుల్లో భారతదేశం ప్రపంచంలోనే మధుమేహానికి (Diabetes Capital) కేంద్రంగా మారుతోంది. వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయసులోనే చాలా మంది బీపీ, షుగర్, పక్షవాతం, గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు.  డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ వ్యాధులన్నింటికీ మన ఆధునిక జీవన విధానం మరియు తప్పుడు ఆహార అలవాట్లే ప్రధాన కారణమని స్పష్టం చేశారు.

1 / 5
శరీరంలో వ్యాధులు రావడానికి ముఖ్య కారణం 'ఇన్ఫ్లమేషన్' (వాపు). మనం నిత్యం వాడే రిఫైన్డ్ ఆయిల్స్ దీర్ఘకాలంలో శరీరానికి ఎంతో హాని చేస్తాయి. రసాయనాలతో శుద్ధి చేసే రిఫైన్డ్ ఆయిల్స్‌కు బదులుగా పాతకాలం నాటి గానుగు నూనెలను వాడటం ఎంతో శ్రేయస్కరం. అలాగే, చాలా మంది శారీరక శ్రమ లేకుండా కూర్చుని పనిచేస్తూ, అవసరానికి మించి కార్బోహైడ్రేట్లు (పిండిపదార్థాలు) ఎక్కువగా ఉండే ఆహారాన్ని, ముఖ్యంగా వైట్ రైస్‌ను అధిక మొత్తంలో తింటున్నారు.

శరీరంలో వ్యాధులు రావడానికి ముఖ్య కారణం 'ఇన్ఫ్లమేషన్' (వాపు). మనం నిత్యం వాడే రిఫైన్డ్ ఆయిల్స్ దీర్ఘకాలంలో శరీరానికి ఎంతో హాని చేస్తాయి. రసాయనాలతో శుద్ధి చేసే రిఫైన్డ్ ఆయిల్స్‌కు బదులుగా పాతకాలం నాటి గానుగు నూనెలను వాడటం ఎంతో శ్రేయస్కరం. అలాగే, చాలా మంది శారీరక శ్రమ లేకుండా కూర్చుని పనిచేస్తూ, అవసరానికి మించి కార్బోహైడ్రేట్లు (పిండిపదార్థాలు) ఎక్కువగా ఉండే ఆహారాన్ని, ముఖ్యంగా వైట్ రైస్‌ను అధిక మొత్తంలో తింటున్నారు.

2 / 5
రోజుకు మూడు, నాలుగు సార్లు తినడం, మధ్యలో చక్కెర వేసిన టీలు పదేపదే తాగడం వల్ల శరీరంలో సడన్‌గా గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి (Glucose Spike) . ఇలా నిరంతరం గ్లూకోజ్ పెరగడం వల్ల 'ఇన్సులిన్ రెసిస్టెన్స్' ఏర్పడి, అది పొట్ట రావడానికి, డయాబెటిస్ మరియు ఇతర గుండె జబ్బులకు దారితీస్తుంది.

రోజుకు మూడు, నాలుగు సార్లు తినడం, మధ్యలో చక్కెర వేసిన టీలు పదేపదే తాగడం వల్ల శరీరంలో సడన్‌గా గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి (Glucose Spike) . ఇలా నిరంతరం గ్లూకోజ్ పెరగడం వల్ల 'ఇన్సులిన్ రెసిస్టెన్స్' ఏర్పడి, అది పొట్ట రావడానికి, డయాబెటిస్ మరియు ఇతర గుండె జబ్బులకు దారితీస్తుంది.

3 / 5
దీనికి పరిష్కారంగా  కొన్ని అద్భుతమైన లైఫ్ స్టైల్ చిట్కాలను డాక్టర్ సూచించారు. ఉదయం లేవగానే చక్కెర వేసిన చాయ్ తాగడం పూర్తిగా మానేయాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశ వంటి కార్బోహైడ్రేట్లు కాకుండా కోడిగుడ్లు, మొలకెత్తిన గింజలు (Sprouts), డ్రై ఫ్రూట్స్ వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని మొదటి ఆహారంగా (First Meal) తీసుకోవాలి.

దీనికి పరిష్కారంగా  కొన్ని అద్భుతమైన లైఫ్ స్టైల్ చిట్కాలను డాక్టర్ సూచించారు. ఉదయం లేవగానే చక్కెర వేసిన చాయ్ తాగడం పూర్తిగా మానేయాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశ వంటి కార్బోహైడ్రేట్లు కాకుండా కోడిగుడ్లు, మొలకెత్తిన గింజలు (Sprouts), డ్రై ఫ్రూట్స్ వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని మొదటి ఆహారంగా (First Meal) తీసుకోవాలి.

4 / 5
రోజుకు రెండు పూటలు మాత్రమే తినడం (Two Meals) ఆరోగ్యానికి ఎంతో మంచిది. మనం తినే తెల్ల అన్నాన్ని కొద్దిగా తగ్గించి, అందులో కొంచెం నెయ్యి (Ghee) కలుపుకుని తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒకేసారి పెరగకుండా అదుపులో ఉంటాయి. నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, దీనికి భయపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. సామాన్య ప్రజలు కూడా ప్రతిరోజూ పాలు, పెరుగు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ బి12ను సహజంగా పొందవచ్చని వివరించారు

రోజుకు రెండు పూటలు మాత్రమే తినడం (Two Meals) ఆరోగ్యానికి ఎంతో మంచిది. మనం తినే తెల్ల అన్నాన్ని కొద్దిగా తగ్గించి, అందులో కొంచెం నెయ్యి (Ghee) కలుపుకుని తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒకేసారి పెరగకుండా అదుపులో ఉంటాయి. నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, దీనికి భయపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. సామాన్య ప్రజలు కూడా ప్రతిరోజూ పాలు, పెరుగు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ బి12ను సహజంగా పొందవచ్చని వివరించారు

5 / 5
Follow Us
సూర్య గ్రహణం కలిసొస్తుంది.. అతి తర్వలో వీరి తలరాత మారడం పక్కా!
సూర్య గ్రహణం కలిసొస్తుంది.. అతి తర్వలో వీరి తలరాత మారడం పక్కా!
పక్కా తెలంగాణ స్టైల్.. ఘాటుగా కారంగా మసాలా చికెన్ ఫ్రై..
పక్కా తెలంగాణ స్టైల్.. ఘాటుగా కారంగా మసాలా చికెన్ ఫ్రై..
మండే టూ సండే.. పిల్లల లంచ్ బాక్స్‌లో ఏ రోజు ఏది పెట్టాలో తెలుసా?
మండే టూ సండే.. పిల్లల లంచ్ బాక్స్‌లో ఏ రోజు ఏది పెట్టాలో తెలుసా?
బాస్మతి బియ్యం లేకుండా బిర్యానీ.. ఎలా చేయాలో తెలుసా?
బాస్మతి బియ్యం లేకుండా బిర్యానీ.. ఎలా చేయాలో తెలుసా?
నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే
నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే
బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!
బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!
ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు
ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు
పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి
పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి
ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !
ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !
అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ
అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ