
ఆర్థికంగా వెనుకబడిన ప్రజల కోసం కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఓ పథకాన్ని ప్రవేశపెట్టి, అమలు చేస్తోంది.

ఈ ప్రభుత్వ పథకం పేరు నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్. ఈ పథకం కింద కుటుంబానికి రూ. 30 వేలు ఆర్థిక సహాయం అందజేస్తారు.

కుటుంబంలో ఒక్కరే సంపాదిస్తున్న వ్యక్తి ఉండి, ఏదైనా కారణం వల్ల మరణిస్తే, ఆ కుటుంబానికి ఈ పథకం ద్వారా రూ. 30 వేలు ఆర్థిక సహాయం అందజేస్తుంది.

నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద యూపీ పౌరులు మాత్రమే ఈ స్కీమ్ను పొందగలుగుతారు. మరణించిన ఇంటి పెద్ద వయసు 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.

కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 46 వేలు మించకూడదు. పట్టణ ప్రాంతంలో కుటుంబ ఆదాయం రూ. 56 వేలు మించకూడదు. ఈ అర్హతలన్నీ ఉంటే.. ఈ పథకానికి అర్హులవుతారు.

ఈ పథకం కోసం ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రం, మరణ ధృవీకరణ పత్రం, బ్యాంకు ఖాతా సమాచారం, మొబైల్ నంబర్, బర్త్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటివి అవసరం అవుతాయి.

ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి, nfbs.upsdc.gov.in కు వెళ్లాలి. అక్కడ దరఖాస్తు ఫారమ్ను పూరించడం ద్వారా అప్లై చేసుకోవచ్చు. అధికారుల ధృవీకరణ తరువాత పథకం ప్రయోజనం పొందుతారు.