
కావాల్సిన పదార్దాలు : పావుకిలో ముల్లంగి ముక్కలు, ఒక కప్పు పెరుగు, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె, కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.

ముందుగా ముల్లంగి బాగా కడిగి వాటిని ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఒక ప్లేట్ లేదా ఒక పాత్ర తీసుకుని ఒక కప్పు పెరుగును తీసుకుని మజ్జిగ కవ్వంతో వాటిని తిప్పుకుని మజ్జిగలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నెలో ముల్లంగి ముక్కలు, ఒక గ్లాస్ నీరు, అర టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. ముక్కలు మెత్తగా అయిన తర్వాత మజ్జిగను పోసి, సన్నని మంటపై మరిగించాలి.

ఇప్పుడు కొత్త పాన్ తీసుకుని కొద్దిగా నూనె వేసి, అర టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి ముక్కలు, నాలుగు కరివేపాకు, 4 పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

అంతే, వేడి వేడి ముల్లంగి మజ్జిగ పులుసు రెడీ. వేసవి కాలంలో ఈ ముల్లంగి మజ్జిగ పులుసును తాగితే వేడి మొత్తం తగ్గుతుంది. ఈ పులుసులో అర కట్ట కొత్తిమీర వేస్తే త్వరగా ఆహారం అరిగిపోయి కొద్దీ సమయంలోనే జీర్ణమవుతుంది