
సినీ తారలు సమయం దొరికినప్పుడల్లా టెంపుల్స్ కు వెళ్తూ ఉంటారు. అయితే, నేడు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా తిరుముల వెళ్ళి ఆ స్వామి వారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఈ ఫోటోలను చూసేయండి.

ప్రముఖ హీరో, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఒక్కడే తిరుమల కు వచ్చిన మోక్షజ్ఞకు టిటిడి అధికారులు ప్రోటోకాల్ దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం మోక్షజ్ఞకు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.

అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకున్న మోక్షజ్ఞకు స్థానిక టిడిపి కేడర్, ఆలయ అధికారులు స్వాగతం పలికారు.రాహుకేతు పూజల్లో పాల్గొన్న మోక్షజ్ఞ మొక్కులు చెల్లించారు.

అనంతరం స్వామి అమ్మ వార్ల దర్శనం చేసుకున్నారు.మోక్షజ్ఞకు మృత్యుజయ స్వామి వద్ద వేదపండితుల ఆశీర్వచనం అందించారు. స్వామి అమ్మవార్ల చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేసారు.

పాలకమండలి చైర్మన్ తోపాటు అధికారులతో కలిసి మోక్షజ్ఞ ఫోటోలు దిగారు. నందమూరి బాలకృష్ణ కొడుకుగా మోక్షజ్ఞ ను చూసేందుకు భక్తులు కూడా ఆసక్తి కనపరిచారు. .