
ఇప్పటికే ఎంతో మంది గుండె పోటుతో మరణించారు. అయితే, ఇవి రోజు రోజుకు పెరుగుతున్నాయి. అసలు, వీరికి సడెన్ గా గుండె పోటు ఎందుకొచ్చిందో ఇంత వరకు సరైన కారణాలు బయటకు రాలేదు.

ఇలా నూనెను పదే పదే వేడి చేయడం వల్ల విషపూరిత పదార్థాలు ఏర్పడతాయని, ఇవి రక్త నాళాలను దెబ్బతీస్తాయని, చెడు కొలెస్ట్రాల్ను పెంచుతాయని, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. ఆవ నూనె, ఆలివ్ నూనె, వేరుశెనగ నూనెను రొటేషన్లో ఉపయోగించడం ప్రయోజనకరం. అయితే మీరు ఏ నూనె ఉపయోగించినా, జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం.

ఆధునిక ఆహారాలు చాలా మంది శరీరాల్లో ఒమేగా-3, ఒమేగా-6 అసమతుల్యతకు కారణమవుతున్నాయని వైద్యులు అంటున్నారు. ఇది గుండెకు హానికరం. వేడి చేసిన నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగించడం కూడా హానికరమే. చాలా మంది ఇంట్లో వేయించిన తర్వాత మిగిలిపోయిన నూనెను తిరిగి ఉపయోగిస్తారు.

మనం రోజూ వంటకు వాడే నూనెల్లో ఒమేగా-6 అధికంగా ఉంటుంది. మరి, దానికి తగ్గ ఒమేగా-3 ఫుడ్స్ ను బ్యాలెన్స్ చేయకపోతే గుండె జబ్బులు ఎక్కువుతాయనిఎం గట్టిగా హెచ్చరించారు.

ఇప్పటి నుంచి వైద్యులు మందులతో పాటు వంట నూనె ఏది వాడాలో కూడా చెప్పాలని సూచించారు. దీని వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరగకుండా ఉంటాయని నిపుణులు వెల్లడించారు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)