ఊపిరితిత్తులను శుభ్రపరచడంతోపాటు కాలుష్య కారకాల హానికరమైన ప్రభావాలను తగ్గించే శక్తి బెల్లంకు ఉంటుంది. వాయు కాలుష్యం సమయంలో ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, విషపూరిత గాలి కణాల వల్ల ఆరోగ్యానికి కలిగే హానిని నివారిస్తుంది. గొంతు చికాకును తగ్గించడానికి, ఊపిరితిత్తుల పనితీరును పెంచడానికి కూడా బెల్లం సహాయపడుతుంది.
రోగనిరోధక కణాల ఉత్పత్తికి తోడ్పడే అవసరమైన ఖనిజాలు, పోషకాలను అందించడం ద్వారా బెల్లం రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. కలుషితమైన గాలి కణాలు, రసాయనాలను పీల్చడం వల్ల గొంతు చికాకును కలిగిస్తుంది. బెల్లం ఈ చికాకు నుండి ఉపశమనం కలిగించే సహజ ఉపశమన లక్షణాలను కలిగి ఉంటుంది.
బెల్లం నీరు శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. బెల్లంలో ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. శ్వాసకోశ వ్యవస్థ, ఊపిరితిత్తులు, ఆహార పైపులు, కడుపు, పేగులను కూడా శుభ్రపరుస్తుంది. ఇది న్యాచురల్ డైజెస్టివ్ ఎంజైమ్లను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ వేగంగా జరిగేలా చేస్తంది. కిడ్నీ సమస్యలను నయం చేస్తుంది.
బెల్లం నీరు శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని ఎలక్ట్రోలైట్, మినరల్ లెవెల్స్ను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. జీవక్రియను పెంచుతుంది. ఫలితంగా అధిక కొలెస్ట్రాల్ సమస్య తలెత్తకుండా ఉంటుంది. ఫలితంగా గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
ఇకపోతే, బెల్లం నీరు తయారీ కోసం కావాల్సినంత బెల్లం, చియా సీడ్స్, నిమ్మకాయ, పుదీనా ఆకులు తీసుకోవాలి. ముందుగా మీకు సరిపడా నీళ్లు తీసుకుని అందులో బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు వేడి చేసుకోవాలి. ఇప్పుడా నీటిలో నిమ్మరసం, చియా సీడ్స్, పుదీనా ఆకులు వేసుకుని కాస్త గోరు వెచ్చగా తాగితే సరిపోతుంది.