
చేపల కూర నీచు వాసన రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు. వాసన రాకుండా ఉంటుంది. అలాగే, కూర కూడా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఈ సారి చేపలను తెచ్చినప్పుడు ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.

అందరి ఇళ్లలో మొక్కజొన్న పిండి ఉంటుంది. మీరు చేపలను శుభ్రం చేసేటప్పుడు ఒక కప్పు మొక్కజొన్న పిండి, మూడు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం కలిపి వాటి మీద రుద్దితే అస్సలు వాసన రాదు.

పాలు లేదా పెరుగు: ముందుగా చేప ముక్కలను ఒక పాత్రలో తీసుకుని దానిలో ఒక గ్లాస్ పాలు లేదా పెరుగు వేసి 30 నిమిషాల పాటు అలా ఉంచి గోరు వెచ్చని నీళ్లతో కడిగితే అది మొత్తం పోతోంది. కూర వండేటప్పుడు ఇలా చేయండి.

ఒక గ్లాస్ నీటిని తీసుకుని దానిలో వెనిగర్ కొద్దిగా కలిపి చేపలను కడిగితే నీచు వాసన మొత్తం పోతోంది. కొన్ని చేపలు ఎంత కడిగినా కూడా నీచు వాసన వస్తూనే ఉంటుంది. ఇలాంటి వాటికీ ఇది కరెక్ట్. మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి.

కూర వండేటప్పుడు ఇది ఫాలో అవ్వండి : చేపల కూర కానీ పులుసు కానీ వండేటప్పుడు కొద్దిగా అల్లం-వెల్లుల్లి పేస్ట్ లేదా చిటికెడు పసుపు వేస్తే వాసన మొత్తం పోతోంది. అలాగే, కూర టేస్ట్ కూడా పెరుగుతుంది.