తక్కువ నీరు తాగి.. అదే సమయంలో ఈ 5 ఆహారాలు ఎక్కువగా తింటే.. మూత్రపిండాల్లో రాళ్ళు పేరుకుపోతాయి. కనుక తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మూత్రం పసుపు రంగుతో పాటు, మూత్రంలో దుర్వాసన, మూత్రంతో రక్తస్రావం, మూత్రవిసర్జన సమయంలో మంట వంటి ఇబ్బందులు కలుగుతాయి. రోజుకు 3 లీటర్ల కంటే తక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి.
కిడ్నీ స్టోన్స్ వల్ల పొత్తి కడుపులో, వెనుక పక్కటెముకలకి రెండు వైపులా తీవ్రమైన నొప్పి వస్తుంది. రోజుకు 3 లీటర్ల కంటే తక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. కిడ్నీ స్టోన్స్ మీ మూత్ర నాళంలో ఏదైనా భాగాన్ని ప్రభావితం చేయవచ్చు.
కిడ్నీలను కాపాదేది కేవలం నీరు మాత్రమే కాదు.. కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే బాగా నీరు తాగమే కాదు.. ఈ ఐదు రకాల ఆహారానికి దూరంగా ఉండాలి.
ఆక్సలేట్స్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తినకూడదు. బచ్చలికూర, బీట్రూట్, బంగాళదుంపలు, పప్పులు, చాక్లెట్లు, వేరుశెనగ వంటి ఆహారాలను ఎక్కువగా తినవద్దు.
ఆహారంలో ఉప్పు వినియోగాన్ని తగ్గించండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పెద్దలు రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును ఉపయోగించరాదు. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలు అలాగే బహుళ అవయవాలు దెబ్బతింటాయి.
కిడ్నీ సమస్యలకు జంతు ప్రోటీన్ను నివారించడం ఉత్తమం. జంతు మాంసకృత్తులు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.
మంచి ఆరోగ్యానికి విటమిన్ సి అవసరం. అయితే విటమిన్ సి ఎక్కువగా పెరిగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. కూరగాయలు, పండ్ల ద్వారా శరీరంలో విటమిన్ సి లోపాన్ని పూరించండి. విటమిన్ సి మాత్రల మోతాదు వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండండి.
ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు. ఫాస్ట్ ఫుడ్ తినడం మానేసి ఇంట్లో వండిన ఆహారాన్ని తినండి. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజుకు 4 లీటర్ల నీరు త్రాగాలి.