
కిడ్నీని ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యం. భారతీయ వంటల్లో ఉపయోగించే కొన్ని ఆయుర్వేద మూలికలను ఉపయోగిస్తే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. వర్షాకాలంలో వీటిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

మూత్రపిండాల కోసం పసుపు: మీ రోజువారీ ఆహారంలో పసుపు పొడితో చేసిన చట్నీని తీసుకోండి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎంజైమ్లు, కర్కుమిన్ అనే సమ్మేళనం కారణంగా శరీరంలో వాపు, నొప్పిని కలిగించే బ్యాక్టీరియా, వైరస్లను నశింపజేస్తుంది.

అయితే, ఎవరికైనా కామెర్లు వస్తే చికిత్స సమయంలో పసుపును తీసుకోవలసిన అవసరం లేదు. దీనికి వైద్యపరమైన కారణాలు కూడా ఉన్నాయి. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ప్రతిరోజూ ఆహారంలో పసుపును తీసుకోవాలి. ఇది కామెర్లు వచ్చే ప్రమాదం నుంచి కాపాడుతుంది. వర్షకాలంలో భోజనం తర్వాత, మంచినీటిలో పసుపు కలిపి తీసుకోండి. ఇలా రోజుకు ఒకసారి మాత్రమే చేయండి.

Ginger

వెల్లుల్లి తినడం ద్వారా జీర్ణాశయంలో ఎంజైమ్స్ ఉత్పత్తి మెరుగుపడుతుంది. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. బరువు తగ్గాలని అనుకునే వారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం మంచిది. తద్వారా జీవక్రియ రేటు పెరిగి కేలరీల ఖర్చు అధికమవుతుంది. బరువు అదుపులో ఉంటుంది. ఇందులోని సెలినియం మంచి నిద్రకు కారణమవుతుంది.