
ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా, వంటింట్లో ఉండే కేవలం నాలుగు వస్తువులతో అప్పటికప్పుడు పదే పదే నిమిషాల్లో స్వీట్ షాప్ కంటే అద్భుతమైన రుచితో ఇన్స్టంట్ జిలేబీలను తయారు చేసుకోవచ్చు. పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా ఉండే ఈ జిలేబీల తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం.

జిలేబీ తయారీకి కావలసిన పదార్థాలు: ఒక కప్పు పంచదార, ఒక కప్పు మైదా పిండి, ముప్పావు కప్పు నీళ్లు, అర టీస్పూన్ యాలకుల పొడి, ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ పెరుగు లేదా నెయ్యి, ఒక టీస్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ మరియు వేయించడానికి సరిపడా నూనె.

పాకం తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో ఒక కప్పు పంచదార, అర కప్పు నీళ్లు పోయాలి. పంచదార పూర్తిగా కరిగి లేత తీగ పాకం వచ్చేంత వరకు మీడియం మంటపై మరిగించాలి. పాకం వచ్చిన తర్వాత అందులో యాలకుల పొడి, చిటికెడు ఫుడ్ కలర్ మరియు ఒక చెంచా నిమ్మరసం వేసి కలపాలి. నిమ్మరసం వేయడం వల్ల పాకం చల్లారినా గడ్డకట్టకుండా పల్చగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి.

పిండి తయారీ & జిలేబీ వేయించే విధానం: ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి. అందులో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా చిక్కటి దోశ పిండిలా కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి పోయకూడదు. పిండి సాఫ్ట్గా కలిసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి లేదా పెరుగు, ఒక టీస్పూన్ బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి.

ఇప్పుడు ఈ పిండిని జిలేబీ మేకర్ బాటిల్లో గానీ, పాల ప్యాకెట్ కవర్లో గానీ లేదా పైపింగ్ బ్యాగ్లో గానీ పోసుకోవాలి. కవర్కు చివరన చిన్న రంధ్రం చేసుకోవాలి. స్టవ్ మీద వెడల్పాటి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి మీడియం వేడి చేయాలి. నూనె వేడెక్కాక పిండిని గుండ్రంగా చుట్లు తిప్పుతూ జిలేబీల్లా వేసుకోవాలి. మీడియం మంటపై రెండు వైపులా తిప్పుతూ మంచి బంగారు రంగు వచ్చి కరకరలాడే వరకు వేయించాలి.