
మన దేశంలోనే కాదు.. అన్ని చోట్లా దోసె చాలా ఫేమస్. దీనిని ఎంతో మంది ఇష్టంగా తింటారు. కొందరు ఉదయం, ఇంకొందరు సాయంత్రం ఇలా ఎప్పుడు పడితే అప్పుడు తింటూనే ఉంటారు. సమయం, సందర్భం అంటూ ఏమీ ఉండదు. ఇప్పుడు కొత్తగా పండిన అరటి పండ్లతో దోసెలు ఎలా వేయాలో ఇక్కడ చూద్దాం..

కావలసిన పదార్థాలు: 3 అరటిపండ్లు, గోధుమ పిండి లేదా బియ్యం పిండి తీసుకున్నా కూడా సరిపోతుంది, బెల్లం తురుము, యాలకుల పొడి, నూనె, ఒక గ్లాస్ నీరు.

ఒక బౌల్ ను తీసుకొని దానిలో పండిన అరటిపండ్లను పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు దానిలో మీరు ఏ పిండి తీసుకుంటే దానిని వేసి, కట్ చేసి పెట్టుకున్న బెల్లం ముక్కలు, కొద్దిగా యాలకుల పొడి వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి

ఇక ఇప్పుడు, దానిలో కొంచం నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలి. మరి, పేస్ట్ లా కాకుండా నార్మల్ దోసె పిండి లాగా ఉంటే చాలు. అప్పుడు దోసెను రెండు వైపులా పెనం మీద సులభంగా కాల్చవచ్చు.

ఇక ఇప్పుడు పాన్ పెట్టి దానిలో కొంచం నూనె వేసి అది వేడయ్యాక, ఒక గరిటెడు పిండిని పోసి దోస లాగా వేయండి. మరి పలుచగా కాకుండా, కొంచం మృదువుగా ఉండేలా వేయండి. ఒక రెండు నిముషాలు అలాగే ఉంచి , రెండు వైపులా కాలిన తర్వాత ఆ దోసెను ప్లేట్ లోకి తీసుకోండి. అంతే వేడి వేడి అరటి దోసె రెడీ. అయితే, దీనినిమీరు నెయ్యితో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.