సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్ సెంట్రల్ విస్టా (డ్రీమ్ ప్రాజెక్ట్) శరవేగంగా నిర్మిస్తున్నారు. న్యూ పార్లమెంట్ భవనం లోపల నుంచి కొన్ని ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో కొత్త పార్లమెంట్ హౌస్ హాల్ పూర్తయినట్లు తెలుస్తోంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కింద నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ లోపల భాగం ఫోటోలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. భారతదేశం కొత్త పార్లమెంట్ హౌస్ బయట నుండి ఎంత గొప్పగా ఉంటుందో, లోపల నుండి మరింత అందంగా కనిపిస్తుంది.
కొత్త పార్లమెంట్ హౌస్ పాత పార్లమెంట్ హౌస్ కంటే చాలా పెద్దది. ఆధునిక సౌకర్యాలతో, ఆకర్షణీయంగా ఉంటుంది. దాదాపు 65,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కింద కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు.
టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తోంది. కొత్త పార్లమెంట్ హౌస్లో ఆడియో విజువల్ సిస్టమ్తో పాటు డేటా నెట్వర్క్ సర్వీస్పై కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు.
విశేషమేమిటంటే, కొత్త పార్లమెంట్ హౌస్లో 1200 కంటే ఎక్కువ మంది ఎంపీలు కూర్చునే సౌలభ్యం ఉంది. ఇక్కడ 888 మంది లోక్సభ ఎంపీలు, 384 మంది రాజ్యసభ ఎంపీలు కలిసి కూర్చోవచ్చు. కొత్త పార్లమెంటు భవనంలో అందమైన రాజ్యాంగ గదిని కూడా నిర్మించారు.
కొత్త పార్లమెంటు భవనంలో లైబ్రరీ, లాంజ్, క్యాంటీన్, కమిటీ హాల్, పార్కింగ్ సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. కొత్త పార్లమెంట్ భవనాన్ని పూర్తిగా భూకంపం తట్టుకునేలా తీర్చిదిద్దారు. నాలుగు అంతస్థుల పార్లమెంట్ భవనం కొత్త భవన నిర్మాణానికి సుమారు రూ.971 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సమాచారం.
పాత పార్లమెంట్ హౌస్ దగ్గరే కొత్త పార్లమెంట్ హౌస్ నిర్మిస్తున్నారు. అహ్మదాబాద్కు చెందిన హెచ్సిపి డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ కంపెనీ కొత్త పార్లమెంటు భవనాన్ని రూపొందించింది.
కొత్త పార్లమెంటు భవనం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 2020లో ఈ భవనానికి శంకుస్థాపన చేశారు. నివేదికల ప్రకారం, ఈ ఏడాది మార్చి నెల నాటికి కొత్త పార్లమెంట్ హౌస్ సిద్ధమయ్యే అవకాశం ఉంది.
అయితే ఈసారి కొత్త బడ్జెట్ను కొత్త పార్లమెంట్ హౌస్లో ప్రవేశపెట్టనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ ఊహాగానాలకు స్వస్తి పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాత పార్లమెంటు భవనంలోనే ప్రసంగిస్తారని చెప్పారు.