
అమరావతి, ఆగస్టు 15: గుంటూరు జిల్లాలోని లోకేష్ స్వంత నియోజకవర్గమైన మంగళగిరి లో పాదయాత్ర ప్రారంభమైంది. నిన్న సాయంత్రం నిడమర్రు వద్ద క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలుగు యువత నేతలు క్యాంపు కార్యాలయం వద్ద వినూత్న రీతిలో జాతీయ జెండా ఎగుర వేశారు.

హాట్ ఎయిర్ బెలూన్లో గాలిలోకి ఎగిరి అక్కడ జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేశారు. తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి హాట్ ఎయిర్ బెలూన్ లో భూమిపై నుండి యాభై అడుగుల పైకి చేరుకున్నారు.

అక్కడ నుండే జాతీయ జెండాను ఎగుర వేశారు. వినూత్న రీతిలో జాతీయ జెండాను ఎగురవేయడం పై తెలుగు తమ్ముళ్లు, పాదయాత్రకు వచ్చిన స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

లోకేష్ స్వంత నియోజకవర్గం కావటంతో తెలుగు యువత వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపడుతుంది. మొదటి మిర్చి గజ మాలతో స్వాగతం పలికిన నేతలు తర్వాత టమాటా గజమాలలతో తాడికొండ నియోజకవర్గంలో వీడ్కోలు పలికారు.

ఇప్పుడు హాట్ ఎయిర్ బెలూన్ లో జాతీయ జెండాను ఎగురవేశారు. మరో రెండు రోజుల్లో ఎన్టీఆర్ జిల్లాకు వెళ్ళనున్ళ లోకేష్ ఏవిధంగా వీడ్కోలు చెబుతారోనని స్థానిక ప్రజలు, నాయకులు చర్చించుకుంటున్నారు.