
ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వాటిని వండే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది మార్కెట్ నుంచి తెచ్చిన ఆకుకూరలను నేరుగా కోసి వండుతుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎందుకంటే కొన్ని ఆకుకూరలు మట్టితో పేరుకుపోతాయి. అందువల్ల మట్టి వాటికి అంటుకుంటుంది. వాటిని సరిగ్గా కడగకుండా వండటం వల్ల, వాటిలోని మట్టి, మలినాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యానికి కారణం కావచ్చు. ఇది మన ఆరోగ్యానికి హానికరం. వాటిని కోసి వండే ముందు ఒకటి లేదా రెండుసార్లు కడగడం ఉత్తమం.

ఆకుకూరలను శుభ్రం చేస్తుంటే ముందుగా వాటిని దులిపి శుభ్రం చేయాలి. దీనివల్ల వాటిపై ఉన్న పురుగులు రాలిపోతాయి. అనంతరం ఒక పెద్ద గిన్నెలో నీళ్లు నింపి, ఆకుకూరలను చిన్న ముక్కలుగా చేసి అందులో వేసి కడగాలి. ముందుగా సగం ఆకుకూరలను నీటిలో 3-4 సార్లు కడగాలి. దీనివల్ల వాటిపై ఉన్న మురికి పూర్తిగా తొలగిపోతాయి.

ఆకు కూరలకు అంటుకున్న పురుగులను తొలగించాలనుకుంటే ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను నీటిలో కలపండి. ఇప్పుడు ఆకుకూరను అందులో వేసి 15 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత వాటిని శుభ్రమైన నీటితో రెండు మూడు సార్లు కడగాలి. పురుగులు సులభంగా ఊడిపోతాయి. మీరు కావాలనుకుంటే కూరగాయలను వెనిగర్ నీటిలో కూడా నానబెట్టవచ్చు.

ఆకుకూరలను సులభంగా శుభ్రం చేయాలనుకుంటే మెష్ బ్యాగ్ను ఉపయోగించండి. ఆకుకూరలను తరిగి బ్యాగ్లో పెట్టండి. ఒక పెద్ద బకెట్లో నీళ్లు నింపి ఆ మెష్ బ్యాగ్ను అందులో ముంచండి. ఇలా చేయడం వల్ల ఆకుకూరల నుంచి దుమ్ము, ధూళి, కీటకాలు అన్నీ తొలగిపోతాయి. అలాగే ఆకుకూరలను కోసి ఉప్పు నీటిలోవేసి అందులో అకుకూరను ఒకేసారి వేసి కడగకుండా, వాటిని 3 భాగాలుగా విభజించి నీటితో 2-3 సార్లు కడగొచ్చు. ఇలా ఆకు కూరలను శుభ్రం చేయడం వల్ల పోషకాలను పొందడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు.