
కావాల్సిన పదార్ధాలు : 100 గ్రాముల పుట్టగొడుగులు, 4 కోడిగుడ్లు, ఒక చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, కొత్తిమీర, అర టీ స్పూన్స్ మసాలా పొడి, రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

ముందుగా స్టవ్ వెలిగించి పాన్లో నూనె వేసి కట్ చేసిన పుట్టగొడుగులను దానిలో సాల్ట్ వేసి నీరు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

ఇక ఇప్పుడ ఒక బౌల్ తీసుకుని కోడిగుడ్లను బ్రేక్ చేసి దానిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు , తరిగిన కొత్తిమీర, మసాలా పొడి కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

పెనం మీద ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్ లా పోయాలి. ఇప్పుడు వాటి మీద ఉడికించిన పుట్టగొడుగులను వేయాలి.

మీడియం మంట మీద పెట్టి ఒక వైపు గోల్డ్ కలర్ లోకి వచ్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి ఆమ్లెట్ ను బాగా వేయించుకోవాలి. అంతే, వేడి వేడి మాష్రూమ్ ఆమ్లెట్ రెడీ.