
కావాల్సిన పదార్ధాలు: పెద్ద చేప ముక్కలు 10, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, 3 టేబుల్ టీస్పూన్ నూనె , 10 కరివేపాకు ఆకులు, ఉల్లిపాయలు చిన్నవి, పచ్చిమిర్చి 4, టమాటో 2, 1 పచ్చి మామిడికాయ , రెండు కప్పులు చింతపండు రసం, కొత్తిమీర తీసుకోవాలి.

ముందుగా కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఉప్పుతో బాగా శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ లో పెట్టాలి. ఇక ఇప్పుడు చేప ముక్కలకు మసాలాలు బాగా పట్టించి 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ధనియాలు, మెంతులు పాన్ లో వేసి 5 నిమిషాల పాటు బాగా వేయించి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసి వేయించి పొడి లాగా పెట్టుకోవాలి.

ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పాన్ పెట్టి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు రంగు మారే వరకు ఉంచండి. ఇక ఇప్పుడు 3 టమాటోలు వేసి మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి.

కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసి మూత పెట్టాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, అన్ని రకాల పొడులు వేసి మిక్స్ అయ్యేలా కలపాలి. కొద్దీ సేపటి తర్వాత చేప ముక్కలు వేసి 20 నిముషాల పాటు అలాగే, ఉడకనివ్వండి. ఇక చివర్లో కొత్తిమీర వేసి దించేయండి. అంతే వేడి వేడి మామిడికాయ చేపల పులుసు రెడీ