
కాజు మఖాన కర్రీని ఎలా తయారు చేయాలంటే? ముందుగా మఖానా వేయించుకోవాలి: పాన్ తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసి రెండు కప్పులు మఖానాను వేసి బాగా వేయించి గిన్నెలో పక్కన పెట్టుకోవాలి.

జీడిపప్పు కూడా వేయించుకోవాలి: ఇక ఇప్పుడు అదే పాన్ తీసుకుని దానిలో జీడిపప్పులు వేసి బాగా వేయించుకోవాలి.

జీడీ పప్పులు, మఖానాను వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు ముక్కలు, టొమాటో ముక్కలు , అల్లం వెల్లుల్లి పేస్ట్ , నాలుగు పచ్చిమిర్చి, మసాలాలు దీనిలో కూడా వేయాలి.

అది మొత్తం పేస్ట్ అయినా తర్వాత , నూనె పైకి తేలే వరకు స్టవ్ మీదే ఉంచి బాగా ఉడికించాలి. ఇప్పుడు దానిలో రెండు కప్పుల పెరుగు వేస్తే గ్రేవీ అవుతుంది.

ఇక చివర్లో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న వేయించిన మఖానా, జీడిపప్పు, మసాలా పొడి, రెండు గ్లాస్ ల నీళ్లు, పోసి 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. చివర్లో కొత్తిమీర వేసి కిందకు దించేయడమే.