
కావాల్సిన పదార్ధాలు : అర కిలో మటన్, ఒక కట్ట గోంగూర, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ సూన్స్ కారం కారం, అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ చికెన్ మసాలా పొడి, ఒక టీ గ్లాస్ నూనె ఉప్పు, తాలింపు గింజలు తీసుకోవాలి.

ముందుగా గోంగూర ఆకులను తీసుకుని వాటిని నీటితో శుభ్రం చేసిన పాన్ లో నూనె వేసి ఉడికించి రొటీలో పేస్ట్ అయ్యే వరకు రుబ్బుకోవాలి.

ఇప్పుడు కుక్కర్ ను తీసుకుని స్టవ్ మీద పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ఆకులు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బంగారు రంగు మారే వరకు వేయించాలి.

ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న మటన్ తీసుకుని చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసి 15 నిముషాలు పాటు కుక్కర్ లోనే వేయించాలి

ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ నీళ్ళు పోసి, కుక్కర్ మూత పెట్టి మటన్ ఉడికే వరకు స్టవ్ మీదే ఉంచండి. కొద్దీ సేపటి తర్వాత గోంగూర పేస్ట్, మసాలా పొడులు వేసి మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. చివర్లో కొత్తిమీర చల్లి దించేయండి. అంతే, వేడి వేడి ఆంధ్రా స్టైల్ గోంగూర మాంసం రెడీ.