
బాస్మతి రైస్ ను మనం రోజు వండుకునే బియ్యం లాగా వీటిని అస్సలు చూడకండి. వీటిని వండే పద్ధతి వేరు అని మర్చిపోకండి. అయితే, బాస్మతి బియ్యం వండేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

బాస్మతి రైస్ సాధారణ బియ్యం లాగా కాకుండా వీటిని బాగా ఉడకనివ్వాలి. దాని కోసం నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నీరు సరిపోను తీసుకోకపోతే బియ్యం సరిగ్గా ఉడకవు. అలాగే, నీరు ఎక్కువైనా కూడా అన్నం మెత్తగా అయిపోతుంది. కాబట్టి, కప్పు బాస్మతి బియ్యానికి 2 కప్పుల నీటిని తీసుకోండి.

బియ్యం ఉడికేటప్పుడు గరిటే పెట్టి ఎక్కువ సార్లు తిప్పకండి. అలా చేస్తే అది అన్నంగా లాగా అయిపోతుంది. బియ్యం ఉడికిందా లేదా అనేది చూడటానికి ఒకసారి మాత్రమే తిప్పి ఆ తర్వాత మూత పెట్టేయండి.

బాస్మతి బియ్యంలో పిండి పదార్థాం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వండే ముందు రెండ సార్లు కడిగితే సరిపోతుంది. అలా అని అదే పనిగా బలం ఉంది కదా అని బియ్యం మీద చూపించి వాటిని ఎక్కువ సార్లు కడగకండి. ఈ బియ్యాన్ని కనీసం 10 నిమిషాలు నానబెట్టాలి. ఇలా చేయడం వలన బియ్యం త్వరగా ఉడుకుతాయి.

బియ్యం ఉడికిన వెంటనే కిందకు దించేయండి. కొందరు మంట మీదే అలాగే ఉంచేస్తారు. ఇలా పొయ్యి మీదే ఉంచడం వలన అన్నం మెత్తగా అయిపోతుంది. కాబట్టి, 10 నిమిషాలు ఉంచి కిందకు దించేసి చికెన్ తో తినేయండి.