
ఇళ్లల్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అతిధులు పక్కా ఉంటారు. వచ్చిన వాళ్ళకి భోజనాలు తప్పక పెట్టాలి. అయితే అలాంటి సమయంలో మీకు మటన్ 3 కేజీలే దొరికితే ఇలా వండితే 15 మందికి ఈజీగా చేసి పెట్టొచ్చు. మరి లేట్ చేయకుండా దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

మూడు కేజీల మటన్ కూర రెసిపీకి కావాల్సిన పదార్దాలు: మూడు కేజీల మటన్, 4 ఉల్లిపాయలు, 7 పెద్ద టమాటాలు, 10 పచ్చిమిర్చి, మూడు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , 4 కప్పుల పెరుగు , ఒక టేబుల్ స్పూన్ పసుపు, 5 టేబుల్ స్పూన్స్ కారం, మూడు టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర పొడిని కూడా తీసుకోవాలి.

ఇంకా వీటితో పాటు నాలుగు టేబుల్ స్పూన్స్ మసాలా, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, మూడు కొత్తిమీర కట్టలు, రెండు కట్టలు పుదీనా , నాలుగు టేబుల్ స్పూన్స్ నిమ్మరసంను తీసుకోవాలి. ఇంకా పోపు కోసం నూనె, 5 బిర్యానీ ఆకులు, 3 దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులను కూడా తీసుకోవాలి.

3 కేజీల మటన్ కూర రెసిపీ తయారీ విధానం: ముందుగా మటన్ను రెండు సార్లు బాగా కడిగి దానిలో కొద్దిగా పెరుగు, పసుపు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనిలో వేసుకోవాలి. ఇంకా 25 నిమిషాల పాటు మెరినేట్ చేయాలి. ఇంకా ఒక పెద్ద గిన్నెలో నూనె వేసి అది వేడయ్యాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేయాలి.

3 కేజీల మటన్ కూర రెసిపీ తయారీ విధానం స్టెప్ 2 : చివర్లో నాలుగు టేబుల్ స్పూన్ కారం, మూడు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా, ఉప్పు కూడా వేసి తిప్పుకోవాలి. ఇప్పుడు మేరినేట్ చేసిన మటన్ వేసి వేసుకోవాలి. ఇంకా ఈ మసాలాలు కూరకు బాగా పట్టించేలా దీనిని ఉడికించి గ్రేవీ వచ్చే వరకు పొయ్యి మీదే ఉంచాలి.