
నోరూరించే పచ్చిమామిడి పచ్చడిని ఇలా చేస్తే రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే, వేడి వేడి అన్నం నెయ్యి వేసుకుని తింటే అదిరిపోతోంది ఈ పచ్చడిని సరైన కొలతలతో చేస్తే పచ్చడి అద్భుతంగా ఉంటుంది. మరి అస్సలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

పచ్చి మామిడి పచ్చడికి కావలసిన పదార్థాలు: పచ్చి మామిడి తురుము, నాలుగు వంకాయలు, 10, నాలుగు పచ్చిమిర్చి, నాలుగు ఎండు మిర్చి, అర కప్పు నూనె, పోపు గింజలు, ఒక టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక టీ స్పూన్ మినపప్పు, అర టేబుల్ స్పూన్ శనగపప్పు, ఇంకా కొద్దిగా చింతపండు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా నాలుగు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను కూడా తీసుకోవాలి.

ముందుగా ఈ పచ్చడిని ఇలా వేయించుకోవాలి : ముందుగా గ్యాస్ పొయ్యి వెలిగించి దానిని స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి. అది వేడి అయ్యాక దానిలో పచ్చి మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసి మీడియం మంటపై బాగా వేయించుకోవాలి. ఒక విషయం ఈ మామిడి, వంకాయ ముక్కలను మెత్తగా ఉడికించుకోవాలి.

ఈ పచ్చడిని రుబ్బుకోవాలి: ఇంకా దీనిలో వేయించిన ఒక కప్పు మామిడి ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ లో పట్టుకోవాలి. ఇంకా దీనిలో వెల్లుల్లి రెబ్బలు , అలాగే చింతపండు, రుచికి సరిపడా ఉప్పును కూడా తీసుకుని వేసుకోవాలి. ఇంకా కొద్దిగా కొత్తిమీరను వేసి మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే తినడానికి పల్లెటూరి రుచి వస్తుంది.

చివర్లో ఇలా పోపు పెట్టుకోవాలి : ఇప్పుడు మళ్ళీ ఇంకో పాన్ తీసుకోని దానిలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక.. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఆవాలు , కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు కూడా వేసి పోపు పెట్టాలి. ఇక చివర్లో రుబ్బిన పచ్చి మామిడి పచ్చడి పోసి ఐదు నిమిషాల పాటు కలిపి కిందకు దించి వేడి వేడి అన్నంలో పెట్టుకుని తినడమే.