
Skincar: కాలేజీ, ఆఫీస్ లేదా బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాక చర్మం జిడ్డుగా ఉండడం అనేది సర్వసాధారణమైన సమస్య. ఇది చాలా చిరాకుగా, అసౌకర్యంగా ఉన్న భావనను కలిగిస్తుంది.

చర్మంపై జిడ్డు ఉండడం వల్ల ముఖంపై దద్దర్లు, మొటిమలు, మచ్చలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ జిడ్డు చర్మంతో పాటు అన్ని రకాల చర్మ సమస్యలకు ఇంట్లోనే ఉండే శనగపిండితో చెక్ పెట్టవచ్చు.

అవును, వారానికి 2 సార్లు శనగపిండితో ఫేస్ ప్యాక్ చేస్తే చర్మ సమస్యలు తొలగిపోవడంతో పాటు చర్మం మెరిసిపోతుంది.

శనగపిండి ఫేస్ ప్యాక్ కోసం ఒక చెంచా ముల్తానీ మట్టి, మరో చెంచా శనగపిండితో బాగా కలపండి. శనగ పిండి చాలా మంచి క్లెన్సర్ అయినందున ఇది ముఖ చర్మం నుంచి జిడ్డును నియంత్రిస్తుంది.

ముల్తానీ మట్టి-శనగపిండి మిశ్రమంలో 1 స్పూన్ రోజ్ వాటర్ వేసి చాలా జిగటగా కలపాలి. దానిలో 5 చుక్కల నిమ్మరసం జోడించండి. ఇది చర్మంపై అధిక చెమట, జిడ్డు భావనను తొలగిస్తుంది.

అనంతరం ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ప్యాక్ పొడిగా అయిపోయాక మీ ముఖాన్ని.. తడిచిన టవల్తో తడి చేయండి. ఇది జిగట అనుభూతిని పూర్తిగా తొలగిస్తుంది.

తర్వాత మీ ముఖాన్ని నీటితో బాగా కడగాలి. అయిపోయాక రెండు ఐస్ ముక్కలను తీసుకని అందులో రోజ్ వాటర్ని మిక్స్ చేయండి. అనంతరం కాటన్ని అందులో ముంచి దాంతో ముఖంపై మసాజ్ చేసుకోండి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే మీ ముఖంపై అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.