
ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి.. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పెనుప్రమాదంగా మారుతున్నాయి. దినచర్యలో మార్పులు, వ్యాయామం చేయకపోవడం వంటి చిన్న చిన్న కారణాల వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. క్యాన్సర్, మధుమేహం, ఊబకాయం వంటివి క్రమంగా ప్రాణాంతక వ్యాధులుగా మారుతున్నాయి. ముఖ్యంగా గుండెపోటు అధిక రక్తపోటు వల్ల సంభవిస్తుంది.. రక్తపోటు పెరిగినప్పుడు దానిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.. ఎందుకంటే ఇది అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే.. హైబీపీని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి..

ఈ పండ్లను తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది: అధిక రక్తపోటు అనేది జీవితాంతం ఉండే వ్యాధి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.. బీపీని నియంత్రించకపోతే ప్రాణాంతకం కావచ్చు.. దీని వల్ల బ్రెయిన్ హెమరేజ్, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. కొన్ని పండ్లను తీసుకోవడం ద్వారా రక్తపోటును నియంత్రించవచ్చు.. ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..

అరటిపండు: అరటి పండు ఏడాది పొడవునా లభించే పండు.. ఇది చాలా పోషకమైనది. అరటి జీర్ణక్రియను బలపరుస్తుంది.. అరటిపండులో ఉండే పోషకాలు రక్తపోటుకు దివ్యౌషధంలా పనిచేస్తాయి.. దీనిని రోజూ తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.. స్ట్రోక్ నుంచి మిమ్మల్ని రక్షించడంలో కూడా సహాయపడుతుంది.

కివి: కివి చాలా పోషకమైన పండు, ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషక మూలకాలు ఉన్నాయి. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉన్నాయని, ఇది జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుతుందని, ఇది కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా పనిచేస్తుంది, ఇది శరీరానికి ఏదైనా వ్యాధితో పోరాడే శక్తిని ఇస్తుంది.

మామిడిపండు: వేసవి కాలంలో దొరికే ఈ పండు రుచికి మాత్రమే కాదు.. అనేక వ్యాధులను దూరం చేస్తుంది. రక్తపోటు సమస్యలతో బాధపడే రోగులకు మామిడిపండు తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్, ఫైబర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ రెండు అంశాలు ఆరోగ్యానికి మేలు చేసే బీపీని నియంత్రించడంలో సహాయపడతాయని నిపుణుల చెబుతున్నారు.