
రాగి పిండిని వాడి ఇంట్లోనే చాలా ఈజీగా ఈ రాగి సమోసాను తయారు చేసుకోవచ్చు. ఇంకా ఇది ఎంతో రుచికరంగా, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మీరు హాస్పిటల్స్ కు వేలకు వేలు ఖర్చులు పెట్టకుండా జీవితకాలం ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి సమోసాలు తింటే సరిపోతుంది. ఇంకా దీనిలో పోషకాలతో పాటు అధిక ఫైబర్ కూడా ఉంటుంది. దీన్ని ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో ఇక్కడ చూద్దాం..

రాగి సమోసాకు కావలసిన పదార్థాలు: ఒక కప్పు రాగి పిండి, అర కప్పు నూనె, రుచికి తగినంత ఉప్పు, అర టేబుల్ స్పూన్ వాము, రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, మూడు ఉడికించిన ఆలూ ( బంగాళాదుంప), ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ కారంను తీసుకోవాలి.

రాగి సమోసా తయారీ విధానం: సమోసా పిండిని ఇలా తయారు చేసుకోవాలి. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని దానిలో రాగి పిండి, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ వాము, ఇంకా దీనిలో కొద్దిగా 2 నూనె వెయ్యాలి. గోరువెచ్చని నీటిని పోస్తూ సమోసా పిండిని గట్టిగా మారే వరకు దీనిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత లోపలి మిశ్రమాన్ని ఇలా తయారు చేసుకోవాలి.

ఇంకా దీనిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాగాక.. అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలు, కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా దీనిలో వేయించాలి. ఇంకా దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఆలాగే, ఉడికించిన ఆలూ, ఒక టేబుల్ స్పూన్ కారం, మసాలా, ఉప్పు కూడా వేసి బాగా కలిపి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించేయాలి.

సమోసాలు ఇలా వేయించుకోవాలి : ముందుగా కలిపి ఉంచిన రాగి పిండిని తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. అయితే, వీటిని పూరీలాగా కొంచం పలుచుగా చేసుకుని వాటిని సగ బాగానికి కట్ చేయాలి. ఆ కట్ చేసిన దానిని తీసుకుని కోన్ ఆకారంలో చేసి లోపల భాగంలో ఆలూ మిశ్రమాన్ని పెట్టి అంచుల చివర నీరు రాసి సమోసా ఆకారంలా చేసి నూనెలో వేయించుకుని తినడమే.