ఉప్పు, నూనె, మసాలాలతో కూడిన ఆహారం తింటే శరీరంలో వేడి పెరిగిపోతుంది. బదులుగా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచే పండ్లు లేదా కూరగాయలను తినాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. పుచ్చకాయ, దోసకాయ, జమ్రుల్, పొటాల్, రొయ్యలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటితోపాటు ఈ కింది పానియాలు కూడా శరీరంలో వేడిని తగ్గించడంలో సహాయపడతాయి. అవేంటంటే..
ఈ వేడిని ఎదుర్కోవడానికి విటమిన్ సి ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిమ్మకాయ రసం రోజుకో గ్లాస్ తాగితే శరీరానికి చల్లని అనుభూతి కలుగుతుంది.
ఒక గ్లాసు చల్లటి పాలలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలుపుని తాగడం వల్ల బాడీ కూల్ అవుతుంది. అలాగే ఎండుద్రాక్ష రసం కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎండుద్రాక్ష రసం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనం చేకూరుతుంది. వేసవిలో చెరుకు రసం శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. చెరకు రసం నోటికి రుచితోపాటు, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది
శరీరాన్ని చల్లగా ఉంచడంలో పెరుగు ప్రభావవంతంగా పనిచేస్తుంది. పెరుగు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పెరుగు షర్బత్, పెరుగు అన్నం, పెరుగు రైతా, బురానీ... ఇలా పెరుగును ఎలా తిన్నా మంచిదే.
శరీరాన్ని బయటినుంచే కాకుండా లోపలి నుంచి కూడా చల్లగా ఉంచుకోవాలి. చర్మాన్ని చల్లగా ఉంచడానికి కొబ్బరి నీళ్లు తాగవచ్చు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం సౌకర్యవంతంగా ఉంటుంది. దద్దుర్లు, చికాకు, మొటిమల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే కట్ చేసిన కీరదోస ముక్కలను కనురెప్పల మీద కాసేపు ఉంచితే.. కళ్లకు విశ్రాంతి కలుగుతుంది.