
ముఖ్యంగా ఉదయం వేళల్లో చాలా మందికి టీ, కాఫీలు లేదా చల్లని నీటిని తాగే అలవాటు ఉంటుంది. అయితే వీటికి ప్రత్యామ్నాయంగా వేడి నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా వేడి నీటిలో కాస్త తేనెను యాడ్ చేసుకుంటే రుచితో పాటు మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు.

కాలకృత్యాలు తీర్చుకోడానికి ముందే 2 లేదా 3 గ్లాసుల గోరు వెచ్చని నీటిని తాగాలి. ఒకేసారి వేగంగా తాగేయకుండా గుటకలు వేస్తూ తాగాలి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు బరువు కంట్రోల్ లో ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజన్స్లో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి వేడినీరు మన శరీరాన్ని రక్షిస్తుంది.

ఉదయాన్నే వేడి నీళ్లు తాగడం వలన రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చాలామంది బరువు తగ్గడానికి వేడి నీళ్లు తాగుతారు. అయితే ఉదయంతో పాటు రాత్రిళ్లు కూడా వేడి నీళ్లు తాగితే సులభంగా బరువు తగ్గుతారు.

నిత్యం క్రమం తప్పకుండా వేడినీళ్లను తాగడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరుగుతుంది. ఉబకాయం, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు వేడి నీరు తాగడం చాలా మంచిది. అంతేకాక వేడినీరు తాగడం వలన అజీర్థి సమస్యలు తొలగిపోవడమే కాక జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి కడుపులో నుంచి బయటకు వచ్చే జీర్ణరసాల స్రావాన్ని వేడి నీరు పెంచుతుంది. ఫలితంగా శరీరంలో గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తగ్గడమే కాక మలబద్ధకం సమస్యకు దూరంగా ఉండవచ్చు.