వెల్లుల్లిని తేనెలో నానబెట్టి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది యాంటీబయాటిక్గా పనిచేసే సూపర్ ఫుడ్. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. అన్ని రకాల ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ను తగ్గించడంలో తేనె, వెల్లుల్లి రెండూ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందడానికి వెల్లుల్లి, తేనె కలయిక చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రెండింటిలోనూ శరీరాన్ని వెచ్చగా ఉంచే గుణాలు ఉన్నాయి. తేనె, వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి గొంతు నొప్పితో పాటు మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
టీ, కాఫీలలో పంచదార కలిపి తాగే బదులు ఎండు నల్ల జీలకర్ర పొడిలో ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటే మధుమేహం నయమవుతుంది. ఎందుకంటే ఇందులో సహజమైన గ్లూకోజ్ ఉంటుంది. అంతేకాకుండా, జీలకర్ర ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా మెరుగుపరుస్తాయి. అందుకే ఈ రెండు పదార్థాలను కలిపి తినడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
వెల్లుల్లి, తేనె కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం, విరేచనాలు, అసిడిటీ, కడుపునొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఇందులో అధికంగా యాంటీ యాక్సిడెంట్స్, ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతగానో మేలు చేస్తాయి. దీని వల్ల చర్మం నిగనిగలాడుతుంది. ఎంతో యవ్వనంగా మెరుస్తుంది. దీనితో పాటు చర్మంపై ముడతలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారని చెబుతున్నారు.
రాత్రిపూట గాజు సీసాలో తేనె వేసి, అందులో కొన్ని పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేయండి. ఇప్పుడు ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత, ఈ సీసా నుండి ఒకటి నుండి రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఖాళీ కడుపుతో నమిలి తినేయండి. మీరు దీన్ని అల్పాహారంతో లేదా రాత్రి భోజనం తర్వాత కూడా తీసుకోవచ్చు. ఉదయం పూట తేనెలో నానబెట్టిన వెల్లుల్లి ఒకటి లేదా రెండు రెబ్బలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.