
మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు వేడి పాలే మంచి నిద్రకు మంచిది కాదు. దాల్చిన చెక్క పొడి, జీలకర్ర పొడి మరియు కుంకుమపువ్వు కూడా కలపవచ్చు. అదే విధంగా వేడి పాలలో జాజికాయ పొడిని కలిపి తాగినా నిద్ర సమస్య తొలగిపోతుంది.

జీలకర్రలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నిద్రకు మేలు చేకురుస్తాయి. ముఖ్యంగా జీలకర్రలో మెలటోనిన్ ఉంటుంది, ఇది నిద్రలేమి, ఇతర నిద్ర రుగ్మతలను తొలగిస్తుంది. పడుకునే ముందు జీలకర్ర టీ తాగడం వల్ల ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

నిద్రలేమి సమస్యలను వదిలించుకోవాలనుకుంటే కుంకుమపువ్వు ఉత్తమంగా పనిచేస్తుంది. ఒక కప్పు గోరువెచ్చని పాలలో రెండు చిటికెల కుంకుమపువ్వు మిక్స్ చేసి తాగితే మంచి ఫలితముంటుంది. అంతేకాదు కుంకుమపువ్వులో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే అనేక పోషకాలు ఉన్నాయి.

చాలా సందర్భాల్లో అధిక అలసట వల్ల నిద్ర పట్టదు. దీనికి ఆయిల్ మసాజ్ మంచి ఉపశమనం. ఆయిల్ మసాజ్ శరీర నాడీ వ్యవస్థను రిలాక్స్ చేస్తుంది. అలసటను తొలగిస్తుంది. పడుకునే ముందు తల, పాదాలను నూనెతో మర్దన చేసుకుంటే ప్రశాంతంగా నిద్ర కలుగుతుంది.

పాలలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది నిద్రను పెంచడానికి సహాయపడుతుంది. అందుకే మంచి నిద్ర కోసం ప్రతిరోజూ పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగాలని నిపుణులు చెబుతుంటారు. ఇక పాల్లోకి అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి తాగితే మరింత మేలు చేకూరుతుంది.

ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆహారంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ఎంతో ముఖ్యం. ఇందుకోసం సరైన సమయానికి పడుకోవడం చాలా ముఖ్యం. రోజు కనీసం 6 నుంచి 7 గంటల పాటు నిద్రపోవాలి. నిద్రపోయేటప్పుడు మొబైల్, ఐప్యాడ్ వంటి వాటిని దూరం పెట్టాలి. ఇది నిద్రకు భంగం కలిగిస్తాయి.