
కావాల్సిన పదార్థాలు : కొర్రలు, కరివేపాకు, టమాటాలు, ఉల్లిపాయలు, క్యాలీఫ్లవర్, ఉప్పు, కారం, సాంబర్ పొడి, నువ్వులు, కొత్తమీర, ఉల్లిపాయలు, సోరకాయ ముక్కలు, నీళ్లు, పెసరపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు.

తయారీ విధానం : ముందుగా కొర్రలు, పెసరపప్పు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి వంట చేసుకోవడానికి ఒక రోజు ముందు మంచిగా నానబెట్టుకోవాలి. దీని వలన త్వరగా ఉడికిపోతాయి. రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో నూనె వేసి, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, టమాటా ముక్కలు, పచ్చి మిర్చీ ముక్కలు ఇవన్నీ వేసి పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. పోపు ఎంత బాగుంటే దీని రుచి అంత బాగుంటుంది.ఇక ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో సాంబర్ పొడి కూడా వేసి మంచిగా కలుపుకోవాలి.

ఇప్పుడు కొలతల ప్రకారం పాన్లో నీళ్లు పోసి మంచిగా మరిగేలా చూసుకోవాలి. నీళ్లు మరిగే సమయంలో కొర్రలు, పెసరపప్పు రెండు వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. అంతే ఇవి బాగా ఉడికిందంటే కొర్రలు పెసరపప్పు కిచిడీ రెడీ అయినట్లే.

ఇక ఇందులో పెసరపప్పు, కొర్రలు ఉండటం వలన వీటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అందువలన ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది చాలా బెస్ట్ అని చెప్పాలి.