
ప్రతి అమ్మాయికీ మాతృత్వ భావన ప్రత్యేకమైనది. అయితే అందరు ఆడపిల్లలు తల్లులు కావాలని కోరుకోరు. ముఖ్యంగా నేటి తరం యువతులు చాలా మంది కెరీర్ తొలినాళ్లలో పిల్లలను కోరుకోవడం లేదు. వారు జీవితంలో స్థిరపడాలని, వారి స్వంత జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో త్వరగా తల్లి అవడానికి ఇష్టపడటం లేదు. కొన్నిసార్లు గర్భస్రావం స్వచ్ఛందంగా, కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా బలవంతంగా అవుతుంది.

అబార్షన్ తర్వాత శరీరం కూడా చాలా బలహీనంగా మారుతుంది. మందులు లేదా ఆపరేషన్లు ద్వారా అబార్షన్ చేసినా, అధిక రక్తస్రావం జరుగుతుంది. శరీరం తీవ్రంగా బలహీనపడుతుంది. శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. మైకం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అబార్షన్ తర్వాత.. శరీరం ఆరోగ్యం కోలుకోవడానికి సహకరించే మందులను మాత్రమే వైద్యులు ఇస్తారు. కానీ ఈ పరిస్థితిలో శరీరం, మనస్సు రెండింటినీ జాగ్రత్తగా చూసుకోవాలి. మెడిసిన్తో పాటు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే సాధారణ జీవితం తిరిగి ప్రారంభమవుతుంది.

రోజువారీ ఆహారంలో ఐరన్, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు తప్పనిసరిగా ఉండాలి. ఇది సంక్రమణ ప్రమాదాన్ని నివారిస్తుంది. రక్తంలో ఎర్ర రక్త కణాల మొత్తాన్ని పెంచుతుంది. ఖర్జూరం, బాదం, పాలకూర, దుంపలు, క్యారెట్లు, సిట్రస్ పండ్లు, యాపిల్స్ మొదలైన వాటిని తినవచ్చు.

అబార్షన్ తరువాత శరీరంలో ఇరన్ లోపం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది మిమ్మల్ని డిప్రెషన్ నుంచి బయటపడేయడానికి, ఎర్ర రక్త కణాల స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. ఈ సమయంలో బాదం, అక్రోట్లను అధికంగా తినాలి.

అలాగే కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని కూడా తీసుకోవాలి. కాల్షియం గర్భస్రావం తర్వాత శరీరాన్ని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ఈ సమయంలో పాలు, డ్రై ఫ్రూట్స్, టోఫు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. తృణధాన్యాలు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గర్భస్రావం తర్వాత జీర్ణ సమస్యలను తగ్గించుకోవడానికి ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా వంటి ఆహారాలను తీసుకోవాలి. అంతేకాకుండా చికెన్, చేపలను తప్పనిసరిగా ఆహారంలో ఉంచుకోవాలి.